AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Trains: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..! రైల్వేశాఖ నుంచి ఫుల్ క్లారిటీ

వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌పై నెలకొన్న గందరగోళానికి రైల్వేశాఖ తెరదించింది. మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మీడియా జరుగుతున్న ప్రచారం వల్ల ప్రయాణికుల్లో గందరగోళం నెలకొందని, అందుకే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపింది.

Vande Bharat Trains: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..! రైల్వేశాఖ నుంచి ఫుల్ క్లారిటీ
Venkatrao Lella
|

Updated on: Dec 10, 2025 | 6:17 PM

Share

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది నెలులుగా ఇవి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి సిటీల మధ్య వందే భారత్ సర్వీసులు ప్రయాణం సాగిస్తున్నాయి. దీంతో వీటి ద్వారా వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు లగ్జరీ ప్రయాణం చేస్తున్నారు. ఈ రైళ్లల్లో ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువగా ఉండటంతో త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాల ప్రజలకు వందే భారత్ స్లీపర్ ట్రైన్ కూడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే దూరపు ప్రయాణాలు చేసేవారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్, యశ్వంత పూర్-కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ సర్వీసులు నడుపుతోంది. ఈ సర్వీసుల షెడ్యూళ్లకు సంబంధించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై అధికారుల స్పందించారు. నిర్వహణ కారణంగా వారంలో ఒకరోజు వందే భారత్ ట్రైన్ల సర్వీసులను నిలిపివేస్తున్నారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ఇక నుంచి శుక్రవారం సర్వీసులు అందించదని, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ సర్వీసులు సోమవారం అందుబాటులో ఉండవని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రయాణికుల అనుమానాలను తొలగించేందుకు ఈ వార్తలపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ ఇచ్చింది.

సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ సర్వీసులను సోమవారం నిలిపివేశారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ వందే భారత్ ట్రైన్ సర్వీస్ బుధవారం నిలిపివేశామని, మిగతా రోజుల్లో యధాతథంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణికుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది.

Follow Us
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం