AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అప్పటివరకు బానే ఉన్న ఆవులు.. అంతలోనే అచేతనంగా.. రీజన్ ఏంటో తెల్సా..?

బంగారం కాదు... ఇప్పుడు దొంగల కన్ను పశువులపై! సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌ వద్ద మత్తుమందు ఇచ్చి ఆవులను దొంగిలించేందుకు ఓ ముఠా చేసిన ప్రయత్నం చివరికి విఫలమైంది. పశువులకు 8 గంటల పాటు వైద్యం ఇవ్వాల్సి వచ్చిన ఈ సంఘటన తొలిసారి జరగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

Andhra: అప్పటివరకు బానే ఉన్న ఆవులు.. అంతలోనే అచేతనంగా.. రీజన్ ఏంటో తెల్సా..?
Cow
P Shivteja
| Edited By: |

Updated on: Jul 28, 2025 | 6:08 PM

Share

ఒకప్పుడు ఇళ్లలో చొరబడి బంగారం, నగదు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు.  కానీ సీసీ కెమెరాలు, పోలీసు పహరాలు, టెక్నాలజీ కారణంగా వారు ఈజీగా దొరికిపోతున్నారు. దీంతో దొంగలు సైతం ఒరిజినల్ ఐడియాలో వెతుకుతున్నారు. పశువులను లక్ష్యంగా ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి.  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామం రోడ్డుపై ఓ వినూత్న దొంగతన యత్నం చోటుచేసుకుంది.

గ్రామ శివారులో ఆవులను మేస్తున్న ఓ రైతు వాటిని అక్కడే కట్టి కొద్దిసేపటికి పక్కకి వెళ్లాడు. అదే సమయంలో దొంగలు వచ్చి ఆవులపై కన్నేశారు.  ఆ పశువులను నేరుగా ఎత్తుకెళ్లటం సాధ్యం కాదని భావించిన దొంగలు, వాటికి మత్తుమందు ఇచ్చి అపహరించడానికి ప్రయత్నించారు. మత్తుమందు తిన్న ఆవులు గంటలకొద్దీ అక్కడే కదలకుండా ఉండిపోవడంతో.. గ్రామస్తులు వెంటనే పశువుల వైద్యుడిని పిలిచి చికిత్స అందించారు. దాదాపు 8 గంటల పాటు అవి అచేతనంగా ఉన్నాయని వారు తెలిపారు.

ఇలాగే మత్తుమందు ఇచ్చి పశువులను దొంగిలించాలన్న ప్రయత్నం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని గ్రామస్తులు చెబుతున్నారు.  ఇటీవల పశువుల ధరలు పెరగడంతో వాటిని దొంగిలించి వెంటనే అమ్మేయవచ్చన్న ఆలోచన దొంగల్లో కనిపిస్తున్నట్లు పోలీసులు కూడా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పశువుల దొంగతనాలు కూడా ఓ కొత్త ముఠా మాదిరిగా వ్యవహరిస్తున్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది.

ఈ ఘటన తర్వాత గ్రామస్థులు తమ పశువులపై మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్