Railway News: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. గతంలో రద్దు చేసిన ఆ రైళ్లను పునరుద్ధరించారు.. చెక్ చేసుకోండి

సాంకేతిక కారణాలతో గతంలో దారి మళ్లించిన లేదా రద్దు చేసిన ఈ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరించింది. వాటి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) బుధవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Railway News: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. గతంలో రద్దు చేసిన ఆ రైళ్లను పునరుద్ధరించారు.. చెక్ చేసుకోండి
Indian Railways

Updated on: Jun 08, 2022 | 6:29 PM

Railway News/IRCTC News: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీలకు ఉపయోగపడే కీలక సమాచారమిది. కర్ణాటక హుబ్లీ డివిజన్‌లోని టోర్నగల్లు వద్ద యార్డ్ రీమోడలింగ్ పనుల నేపథ్యంలో గతంలో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను సౌత్ వెస్టర్న్ రైల్వేస్ దారిమళ్లించింది. మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో గతంలో దారి మళ్లించిన లేదా రద్దు చేసిన ఈ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరించింది. వాటి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) బుధవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గతంలో రద్దు చేసిన హుబ్లీ – విజయవాడ రైలు (నెం.17329)ను ఈ నెల 10 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విజయవాడ – హుబ్లీ (నెం.17330) రైలును ఈ నెల 11 తేదీ నుంచి పునరుద్ధిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే దారి మళ్లించిన యశ్వంత్ పూర్ – హెచ్. నిజాముద్దీన్ (రైలు నెం.12649), హెచ్.నిజాముద్దీన్ – యశ్వంత్‌పూర్ (నెం.12650) రైళ్లను మునుపటి మార్గాల్లోనే నడపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

అటు నాందేడ్ – మేడ్చల్ (నెంబర్.07971) రైలు షెడ్యూల్లో ఈ నెల 9, 10 తేదీల్లో మార్పులు చేశారు. ఈ రైలు నాందేడ్‌లో వేకువజామున 04.55 గం.లకు బదులుగా 06.35 గం.లకు బయలుదేరి వెళ్లనుంది. ఆ మేరకు మిగిలిన రైల్వే స్టేషన్లలోనూ ఆ రైలు రాకపోకలకు సంబంధించిన సమాయాల్లో మార్పు ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పునరుద్ధరించిన, రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు.. 

Railway News

 

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..