
ఈ హెడ్లైన్స్ చూడండి ఒకసారి..! ‘అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు’. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్టిక్యులర్గా ఈ డైలాగే ఎందుకొచ్చింది? ‘సమయం లేదు మిత్రమా.. కాంగ్రెస్ సర్కార్ కూలడం పక్కా’. దాదాపు రెండేళ్లుగా వినిపించని ఈ టాపిక్.. కేటీఆర్ నోటి నుంచి ఎందుకొచ్చింది? అంతా జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్ మాయ. అజార్కు మంత్రి పదవి ఇస్తే రాజకీయం, కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘రౌడీ’ రాజకీయం, ఏడిస్తే రాజకీయం, కులాలపైనా రాజకీయం. అసలు జూబ్లీహిల్స్ గల్లీల్లోకి రాని టాపిక్ అంటూ లేదు. ఆపరేషన్ సింధూర్లో పాక్పై భారత్ చేసిన మెరుపుదాడి కూడా జూబ్లీహిల్స్లో ఎన్నికల అంశమే. కాదేదీ కామెంట్కు, కౌంటర్కు అనర్హం అన్నట్టు.. జూబ్లీహిల్స్లో ప్రతి చిన్న అంశం ఎలక్షన్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ.. ఏ పార్టీ సౌండ్ ఎక్కువగా ఉంది? దానికి రీసౌండ్ ఎలా వస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కార్నర్లలో నిల్చుని డైనమైట్ లాంటి డైలాగ్స్ పేల్చుతున్నారు. గల్లీ చిన్నది కావొచ్చు గానీ ఆ లీడర్ల డైలాగ్స్ పెద్దవి. బడా లీడర్లంతా గ్రౌండ్ అయ్యారు కాబట్టే అంత సౌండ్. ఊహకు కూడా అందని అంశాలు.. ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఓ టాపిక్ మొదలుపెడితే.. మిగిలిన రెండు పార్టీలు అట్నుంచి, ఇట్నుంచి కౌంటర్ ఇస్తున్నాయి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ పాకాన పడుతోంది. జూబ్లీహిల్స్లో ట్రైయాంగిల్ వార్ కోరుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలోకి దిగిన మొదటి...