AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందిగా.. ఖమ్మం జిల్లాలో వింతను చూసి ప్రజలు షాక్..

బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి..

Telangana: బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందిగా.. ఖమ్మం జిల్లాలో వింతను చూసి ప్రజలు షాక్..
Neem Tree
Shiva Prajapati
|

Updated on: Dec 06, 2022 | 10:01 AM

Share

బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామం ఇది. ఈ గ్రామస్తుడు రాందాస్‌ కుటుంబ సభ్యులు ఓ వేప చెట్టుకింద నిత్యం పూజలు చేస్తుంటారు.. కొంత కాలంగా ఈ చెట్టు నుంచి తెల్లడి ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. ముందు పెద్దగా పట్టించుకోలేదు.. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది.. వేప చెట్టుకు కల్లు కారుతోందనే వార్త ఈనోటా, ఆనోటా అందరికీ తెలిసిపోంది.. దీంతో గుడితండాతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.. ఇది ఏ దేవుని మహిమో తమకు అర్థం కావడం లేదంటున్నారు రామదాసు..

సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుంది. ఇక్కడ వేప చెట్టు నుంచి కల్లు కారడం ఏమిటో అంతుబట్టడంలేదంటున్నారు స్థానికులు.. ఇలాంటి దృశ్యాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.. కొందరైతే ఏకంగా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.. బ్రహ్మంగారు చెప్పినట్లు లోకంలో ఎంతో వింతలు జరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!