AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలర్ వేసుకుని చల్లగా నిద్రపోయిన తల్లీకూతుళ్లు.. తెల్లాసరికల్లా..!

వేసవి ఉపశమనం తెచ్చిన ఎయిర్ కూలర్‌ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇంట్లో అమర్చిన కూలర్‌తో కరెంట్ షాక్ కొట్టి తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం గుల్లా తండాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కూలర్ వేసుకుని చల్లగా నిద్రపోయిన తల్లీకూతుళ్లు.. తెల్లాసరికల్లా..!
Mother And Daughter Die
Follow us
Diwakar P

| Edited By: Balaraju Goud

Updated on: May 11, 2025 | 5:43 AM

వేసవి ఉపశమనం తెచ్చిన ఎయిర్ కూలర్‌ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇంట్లో అమర్చిన కూలర్‌తో కరెంట్ షాక్ కొట్టి తల్లి, కూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం గుల్లా తండాలో చోటుచేసుకుంది.

జుక్కల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుల్లా తండాకు చెందిన ప్రహ్లాద్‌కు భార్య శాంకబాయి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో చదువుకుంటోంది. ప్రహ్లాద్‌ శుక్రవారం(మే 08) రాత్రి పని మీద హైదరాబాద్‌ వెళ్లారు. భార్య శాంకబాయి (36), చిన్న కుమార్తె శ్రీవాణి (12), కుమారుడు (16) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఎండల వేడిమి తట్టుకోలేక, శాంకబాయి పిల్లల కోసం కూలర్ ఆన్ చేసి పడుకుంది.

ఇదే సమయంలో ముందుగా చిన్న కూతురు శ్రీవాణి కాలు కూలర్‌కు తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది శ్రీవాణి. కరెంట్ షాక్‌ తీవ్రతతో ఆమె కాలి వేళ్లు కాలిపోయాయి. అయితే, పక్కనే ఉన్న తల్లి శాంకబాయిని కుమార్తె భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో నిద్రలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొంచెం దూరంగా నిద్రపోయిన కుమారుడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి తల్లి, చెల్లి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూసేసరికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మద్నూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతానికి కారణమైన కూలర్‌ ఇనుముది కావడం, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా స్థానిక తయారీ కావడంతోనే షాక్‌ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తండాలోని ఇళ్లల్లో కరెంట్ షాక్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా రెండు ప్రాణాలే పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తుశాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఎఈ పరిశీలించరు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ మాన్‌స్టర్‌లకు లక్కీ ఛాన్స్.. ఇంగ్లండ్‌ టూర్‌కి ఎంపిక?
ఐపీఎల్ మాన్‌స్టర్‌లకు లక్కీ ఛాన్స్.. ఇంగ్లండ్‌ టూర్‌కి ఎంపిక?
ఈ జంతువులు మీకు కలలో కనిపిస్తే మీకు రాజ్యయోగం కలగనుందట..
ఈ జంతువులు మీకు కలలో కనిపిస్తే మీకు రాజ్యయోగం కలగనుందట..
SRH దెబ్బతో చెరిగిపోయిన RCB టాప్-2 కల! RCB గతేంటి?
SRH దెబ్బతో చెరిగిపోయిన RCB టాప్-2 కల! RCB గతేంటి?
తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..
తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..
3.1 ఓవర్లలో 3 పరుగులు.. 3 వికెట్లతో బీభత్సం.. కట్‌చేస్తే..
3.1 ఓవర్లలో 3 పరుగులు.. 3 వికెట్లతో బీభత్సం.. కట్‌చేస్తే..
అభిషేక్ సిక్స్ తుఫాన్.. 5 లక్షల ఫైన్! కారణం ఇదే..
అభిషేక్ సిక్స్ తుఫాన్.. 5 లక్షల ఫైన్! కారణం ఇదే..
కురుస్తున్న వర్షాలతో బయటకు వస్తున్న పాములు.. భయం... భయంగా రైతులు
కురుస్తున్న వర్షాలతో బయటకు వస్తున్న పాములు.. భయం... భయంగా రైతులు
అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి
అది ఏడుపుగొట్టు సినిమా కాదు.. కానీ కన్నీళ్లు వస్తాయి
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.! వచ్చే 3 రోజులు పిడుగుల వర్షాలు
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..
పీరియడ్స్ టైంలో స్త్రీలకు ఎందుకు విశ్రాంతినిచ్చారో తెలుసా..