AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వానలే వానలు.. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్

ఈ ఏడాది రుతుపవనాల ఎంట్రీ కాస్త లేటయ్యింది. అయితే మాత్రం ఇకపై వానలు దంచికొడతాడయని క్లారిటీ ఇచ్చింది వెదర్ డిపార్ట్‌మెంట్. పలు జిల్లాలకు కీలక సూచనలు చేసింది. ఆ డీటేల్స్..

Telangana: వానలే వానలు.. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్
Telangana Weather Report
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2023 | 8:49 AM

Share

ఇకపై వానలే వానలు. అవును…  తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మొత్తం ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరో 24 గంటల్లో రాష్ట్రం అంతటా ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  గంటకు 6-10కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.

“రాబోయే 24 నుండి 48 గంటల్లో రుతుపవనాలు మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేస్తాయి. ప్రస్తుతం, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వేడి ప్రేరేపిత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి” అని IMD సీనియర్ అధికారి తెలిపారు. సాధారణంగా, ఋతుపవనాలు జూన్ 8-10 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించి.. జూన్ 12-14 నాటికి రాష్ట్రం మొత్తం విస్తరిస్తాయి. ఈ ఏడాది 12 రోజులు ఆలస్యమైంది. 

గురువారం నగరంలోని బాలానగర్‌, చింతల్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, బేగంపేట, ఎల్‌బీనగర్‌, ఘట్‌కేసర్‌, కీసర, బంజారాహిల్స్‌, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గచ్చిబౌలిలో 2 మి.మీ, మాదాపూర్ (1.5 మి.మీ), ఖాజీపేట (1.2 మి.మీ) వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, ములుగు, భద్రాద్రిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, యాదాద్రిలో భారీ వర్షపాతం నమోదు కాగా, పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. 

కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలంగాణలోని తూర్పు, ఉత్తరాన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.