Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

Hyderabad: ఓ ముస్లిం యువకుడు, హిందూ యువతి రిజిస్ట్రేషన్ మ్యారేజీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
Rajasingh
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2022 | 11:25 PM

Hyderabad: ఓ ముస్లిం యువకుడు, హిందూ యువతి రిజిస్ట్రేషన్ మ్యారేజీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సోమవారం ఒక వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్.. లవ్ జిహాదీ పేరుతో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 30న మారేడ్‌పల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రేమ జంట పెళ్లికి సిద్ధమైంది. హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. హిందూ సమాజం కూడా ఇటీవల ముస్లిం యువకుల చేతిలో హత్యకు గురైన నాగరాజు సంఘటనలా స్పందిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. హిందూ, ముస్లిం వివాహ యోచన నిజమైతే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వివాహాలు మత సామరస్యానికి భంగం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు రాజాసింగ్. లవ్ జిహాదీ పేరుతో హిందూ మతంపై పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. హిందూ తల్లిదండ్రులు తమ కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు రాజాసింగ్. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయకూడదో చిన్నప్పటి నుంచే నేర్పించాలని వ్యాఖ్యానించారు. హిందూ సమాజంలో చైతన్యం అవసరం అన్నారు. కాలనీలు, సొసైటీల జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో అమ్మాయిలు ఉంటే భయంతో బతకాల్సి వస్తుందన్నారు. లవ్ జీహాదీ పేరుతో కొందరు పనిగట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు.