CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ

CM KCR: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా..

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం.. పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. ఆదేశాలు జారీ
Follow us

|

Updated on: Feb 26, 2021 | 9:27 PM

CM KCR: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ ముందడుగు వేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆశించినట్లుగా ఫలితాలు రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం మరింత అప్రమత్తం అయింది. అచితూచి అడుగులు వేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్‌ పెట్టాలని వ్యూహాలు రచిస్తుండటం, మరో వైపు ఇతర విపక్షాలు, ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండటంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పట్టభద్రుల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముగ్గురు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుసో్తోంది. రంగారెడ్డికి మంత్రి హరిష్ రావు, హైదరాబాద్‌ కు గంగుల కమలాకర్‌, మహబూబ్‌ నగర్‌ కు మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యత పలువురు మంత్రులకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీంతో ఆ బాధ్యతలను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పట్టభద్రులు తప్పకుండా గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కువ మంది తమకు కేటాయించని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించలేకపోయారు. ఈసారి మాత్రం ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్‌. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తప్పకుండా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి పని చేయాలని, లేకపోతే ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థులు తప్పకుండా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది టీఆర్‌ఎస్‌. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం, హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో సరైన మెజార్టీ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత అప్రమత్తమైంది.

నామినషన్ల ఉపసంహరణ

కాగా, ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులుండగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ముగ్గురు అభ్యర్థులు నామినషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..