AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Ram Meghwal: వంద రూపాయలు రిలీజ్ చేస్తే రూ.15 కూడా చేరేది కాదు.. జియో ట్యాగింగ్‌తో అవినీతికి ప్రధాని మోదీ చెక్ పెట్టారన్న కేంద్ర మంత్రి

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరేది కాదని.. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతలో డబ్బులను జమచేయాలని నిర్ణయించిందన్నారు.

Arjun Ram Meghwal: వంద రూపాయలు రిలీజ్ చేస్తే రూ.15 కూడా చేరేది కాదు.. జియో ట్యాగింగ్‌తో అవినీతికి ప్రధాని మోదీ చెక్ పెట్టారన్న కేంద్ర మంత్రి
Arjun Ram Meghwal
Sanjay Kasula
|

Updated on: May 29, 2023 | 5:44 PM

Share

మోదీ పాలనలో అవినీతికి తావు లేదని అన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్‌ మేఘవాల్. మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరేది కాదని.. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించిందన్నారు. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతలో డబ్బులను జమచేయాలని నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్వహించిన సందర్భంలో ఇదే జరిగేదని అన్నారు. కానీ అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదన్నారు.

మోడీ ప్రధాని వచ్చిన తర్వాత ఇండ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడంతో నేరుగా లబ్ధిదారుకు ఫలాలు అందున్నాయని అన్నారు. 2047 టార్గెట్‌ విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు. భారత దేశ వికాసానికి ప్రధాని మోదీ కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పేది.. కానీ నిర్మించేవారు కాదన్నారు. కానీ మోదీ పాలనలో 3.5 కోట్లకు పైగా ఇండ్లు నిర్మించామని గుర్తు చేశారు. వీటితోపాటు దేశ వ్యాప్తంగా 11.72 కోట్ల టాయిలెట్లు నిర్మించామన్నారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా చీపురు పట్టుకుని క్లీనింగ్ మొదలు పెట్టారని అన్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లు అధునాతనంగా తీర్చిదిద్దామన్నారు. గతంలో దుర్గంధభరితంగా ఉండేవన్నారు. దేశవ్యాప్తంగా జన్ ఔషధి మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేశామన్నారు.. పాండిచ్చేరిలోనూ ఇలాంటివి తీసుకొచ్చామన్నారు. అది చూసి అక్కడి ప్రజలు ‘మెడిసిన్’ కోరుకోవడం లేదరి.. ‘మోడీసన్’ కావాలనుకుంటున్నారని అభివర్ణించారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్‌ మేఘవాల్.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్