AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. కట్ చేస్తే చివర్లో అదిరిపోయే ట్విస్ట్! వీడియో

మద్యం మత్తులో పెరుగు కోసం పెద్ద యుద్దానికే పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడటగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..

బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. కట్ చేస్తే చివర్లో అదిరిపోయే ట్విస్ట్! వీడియో
Fight Over Curd At Biryani Centre
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 30, 2026 | 4:09 PM

Share

మంచిర్యాల, ఆగస్ట్‌ 30: మంచిర్యాల జి సింల్లాగరేణి ప్రాంతంలో మద్యం మత్తులో పెరుగు కోసం పెద్ద యుద్దానికే పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడటగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం రాత్రి పొన్నాల ప్రశాంత్, పొన్నాల కిషోర్ అనే ఇద్దరు యువకులు శ్రీరాంపూర్‌లోని శివాజీ బిర్యానీ సెంటర్ లో బిర్యాని తినేందుకు వెళ్లారు. బిర్యానీ తింటుండగా మధ్యలో పెరుగు విషయంలో హోటల్ సర్వెంట్ అనుకుని మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తి పెరుగు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. మీకు నేనెలా కనిపిస్తున్నా పని మనిషిలా కనిపిస్తున్నానంటూ ప్రశాంత్ నిలదీశాడు. అంతే ఇద్దరి మద్య మాట మాట పెరిగింది. పొన్నాల ప్రశాంత్ అనే యువకుడు మనుబోతుల ప్రశాంత్ అనే వ్యక్తి పైకి‌ దాడికి దిగాడు. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో హోటల్ యజమాని భయబ్రాంతులకు గురయ్యారు. కిషోర్ సైతం ప్రశాంత్ పైకి దాడికి రావడంతో ముగ్గురి మద్య తోపులాట జరిగింది.

ప్రశాంత్ ప్లాస్టిక్ థమ్సప్ బాటిల్ విసరడంతో మనుబోతుల ప్రశాంత్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి సీసీ పుటేజ్ ఆదారంగా కేసులు నమోదు చేశారు. మనుబోతుల ప్రశాంత్ ఫిర్యాదు తో పొన్నాల ప్రశాంత్ , పొన్నాల కిషోర్ లపై శ్రీరాంపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పెరుగు విషయంలో గొడవ జరిగినట్టుగా గుర్తించారు. నిందితులు ఫిర్యాదుదారుడిపై చేతులతో, వాటర్, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిళ్లతో దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు‌.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా కథనాల్లో బీర్ బాటిల్స్ తో దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుందని.. అది వాస్తవం కాదని శ్రీరాంపూర్ సీఐ ఆకుల అశోక్ వివరణ ఇచ్చారు. దర్యాప్తులో లభించిన సమాచారం ప్రకారం ఫిర్యాదుదారుడిపై ప్లాస్టిక్ thumsup బాటిళ్లు , చేతులతోనే దాడి జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు‌. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని సీఐ అశోక్‌ తెలిపారు.

Follow Us
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!