Hyderabad: మరీ ఇలా ఉన్నారేంట్రా.. ఏకంగా వినాయకుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లారు.. షాకింగ్ విజువల్స్ మీకోసం..
Hyderabad: ఏం జరిగిందో, ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు గానీ.. ముగ్గురు వ్యక్తులు ఏకంగా గణేషుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లారు.
Hyderabad: ఏం జరిగిందో, ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు గానీ.. ముగ్గురు వ్యక్తులు ఏకంగా గణేషుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. గణేషుడి విగ్రహం చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో చిక్కాయి. ఇప్పుడీ ఘటన వినాయక చవితి ముందు జంట నగరాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ ఓ సినిమాలో పాడిన ఈ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు అన్ని రకాల నిత్యావసర వస్తువులకు ధరలు పెరిగినట్లే.. గణేషుడి విగ్రహాల రేట్లు కూడా చుక్కల్లో తేలుతున్నాయి. ధరల కారణంగానో.. మరే కారణం చేతనో తెలియదు గానీ.. వినాయకచవితి పండుగ వేళ గణేషుడి విగ్రహాలనే ఎత్తుకెళ్లారు ముగ్గురు యువకులు. హైదరాబాద్ సమీపంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ జరిగింది. రాఘవేంద్ర భవన్ హోటల్ దగ్గర సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో వినయాకుడి విగ్రహాన్ని దొంగించారు దుండగులు. అయితే, ఈ చోరీ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. విగ్రహాల తయారీదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..