AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..’ ముళ్ళపోదల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు

మాతృ ప్రేమ మలీనమవుతోంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుంటుంది. మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి. లోకం కూడా చూడని పసికందును కఠినాత్ములు ముళ్లపొదల్లో పడేశారు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. అక్కడి ముళ్ళపోదల్లో స్థానికులకు..

Telangana: 'ఆ తల్లికి చేతులెలా వచ్చాయో..' ముళ్ళపోదల్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు
Baby Boy In Bushes
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 24, 2024 | 12:01 PM

Share

కొండమల్లేపల్లి, జనవరి 24: మాతృ ప్రేమ మలీనమవుతోంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచే దూరం చేసుకుంటుంది. మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి. లోకం కూడా చూడని పసికందును కఠినాత్ములు ముళ్లపొదల్లో పడేశారు. పడేసింది ఎవరు ? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. అక్కడి ముళ్ళపోదల్లో స్థానికులకు ఓ పసికందు కనిపించింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళపోదల్లో పడేశారు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులకు రక్తస్రావంలో కేకలు వేస్తున్న చిన్నారి అరుపులు వినిపించాయి.

ముళ్ళ పొదల్లో కనిపించిన మగ శిశువును వెంటనే అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు. స్థానిక అంగన్వాడి టీచర్ కు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. గ్రహణం మోర్రితో పుట్టినందుకే మగ శిశువును ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కొండమల్లేపల్లి ప్రాంతంలో ఆసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళల వివరాలను సేకరిస్తున్నారు.

మరో ఘటన: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భర్త మృతి, భార్యకు గాయాలు

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మెడికల్‌ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన మేరకు.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లికి చెందిన దంపతులు తిరుమలేశ్‌, లక్ష్మి నాగర్‌కర్నూల్‌ ద్విచక్ర వాహనం పై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తిరుమలేశ్‌ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మి తీవ్రంగా గాయపడింది. నాగర్‌కర్నూల్‌ జనరల్‌ దవాఖానలో లక్ష్మి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్‌ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

దుస్థానంలో శుక్రుడు....ఆ రాశుల వారికి కష్టనష్టాలు జాగ్రత్త..!
దుస్థానంలో శుక్రుడు....ఆ రాశుల వారికి కష్టనష్టాలు జాగ్రత్త..!
రేపట్నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. పెరిగిన హాలిడేస్‌!
రేపట్నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. పెరిగిన హాలిడేస్‌!
పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండానే ఇలా ఫిర్యాదు చేయండి..
పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండానే ఇలా ఫిర్యాదు చేయండి..
ICE ఏజెంట్లకు చుక్కలు చూపించిన డెలివరీ బాయ్..!
ICE ఏజెంట్లకు చుక్కలు చూపించిన డెలివరీ బాయ్..!
OnePlus నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు,, 9000mAh బ్యాటరీ..
OnePlus నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు,, 9000mAh బ్యాటరీ..
జైల్లో నన్ను అలా చేశారు.. అది నన్ను ఎంతో కలిచివేసింది..
జైల్లో నన్ను అలా చేశారు.. అది నన్ను ఎంతో కలిచివేసింది..
ఇంట్లో శంఖం ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? పూజిస్తే లక్ష్మీ కటాక్ష
ఇంట్లో శంఖం ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? పూజిస్తే లక్ష్మీ కటాక్ష
ఫస్ట్ నైట్ రోజే పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిసి భార్య షాక్..
ఫస్ట్ నైట్ రోజే పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిసి భార్య షాక్..
నీచ చంద్రుడితో వారు ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం..!
నీచ చంద్రుడితో వారు ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం..!
ప్రతిరోజూ రాత్రి 9 గంటల తర్వాత తింటారా? అలా అయితే, బాడీ షెడ్డుకే
ప్రతిరోజూ రాత్రి 9 గంటల తర్వాత తింటారా? అలా అయితే, బాడీ షెడ్డుకే