Water War: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ

గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల సబ్‌ కమిటీ ఇవాళ సమావేశం జరగనుంది. ముందుగా 11 గంటలకు జీఆర్‌ఎంబీ..ఒంటి గంటకు కేఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది.

Water War: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ
Krishna Godavari River Man
Follow us

|

Updated on: Sep 17, 2021 | 8:24 AM

గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డుల సబ్‌ కమిటీ ఇవాళ సమావేశం జరగనుంది. ముందుగా 11 గంటలకు జీఆర్‌ఎంబీ..ఒంటి గంటకు కేఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చించనున్నారు. గతంలో జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో జరుగనుంది. ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశమవుతాయి.

గోదావరి ఉప సంఘానికి బోర్డు సభ్యకార్యదర్శి, కృష్ణా ఉప సంఘానికి బోర్డు సభ్యుడు కన్వీనర్​గా ఉన్నారు. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్కో అధికారులు ఉపసంఘంలో సభ్యులు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై భేటీలో చర్చిస్తారు.

కృష్ణా, గోదావరి బోర్డులకు చీఫ్ఇంజినీర్లను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజినీర్లు నియామించింది. కేఆర్‌ఎంబీకి టీకే శివరాజన్, అనుపమ్‌ ప్రసాద్, జీఆర్‌ఎంబీకి ఎంకే సిన్హా, జీకే అగర్వాల్‌ను నియమించింది. అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?

Latest Articles
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.