Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.. ఇందులో భాగంగా హైదరాబాద్ మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయనకు విద్యార్థులు బావర్చీ హోటల్ కు రావాలంటూ ఆహ్వానం పంపారు.. బీర్యానీ తింటూ మాట్లాడుకుందాం అంటూ.. ఆయన కోసం ఓ సీటును కూడా ఏర్పాటు చేశారు..

Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Rahul Gandhi
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 05, 2024 | 4:31 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదులో కొన్ని గంటలు ఆయన గడపనున్నారు. మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బావర్చీ హోటల్ వద్దకు రండి.. బిర్యానీ తిందామంటూ కొంతమంది విద్యార్థులు.. రాహుల్ గాంధీను ఆహ్వానిస్తున్నారు. బావర్చీ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు హైదరాబాద్ పర్యటనల్లో ఆయన పారడైజ్ బిర్యానీ తిన్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు పిలుస్తున్న ఆహ్వానం వేరేది.. గత ఏడాది ఇదే సమయంలో ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులను కలుసుకున్నారు. అక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆయనే చాయ్ తాగించారు. విద్యార్థులతో అశోక్ నగర్ లో భేటీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే.. అదే అశోక్ నగర్ కి ఆనుకుని ఉన్న బావర్చీ బిర్యానీ హోటల్ లో బిర్యానీ తింటూ ఉద్యోగాల సంగతి మాట్లాడుకుందాం.. అంటూ ఇప్పుడు అక్కడి స్టూడెంట్ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తున్నామంటూ ఒక కుర్చీకి రాహుల్ గాంధీ ఫోటోను తగిలించి.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సాయంత్రం రాహుల్ గాంధీ రాక సందర్భంగా చాలామంది విద్యార్థులు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..