AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం నిరుద్యోగులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే డబ్బులిచ్చారు.. చివరకు ఏం జరిగిందంటే..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అన్నారు.. ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు.. లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. పోస్టింగ్ అంటూ చెప్పారు.. వర్క్ ఫ్రం హోమ్ అన్నారు.. చివరకు అందరినీ మోసం చేశారు.. హైదరాబాద్‌లో మరో కంపెనీ నిరుద్యోగులను సాఫ్ట్‌గా మోసం చేసింది.. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు..

పాపం నిరుద్యోగులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే డబ్బులిచ్చారు.. చివరకు ఏం జరిగిందంటే..
Hyderabad Software Job Scam
Shaik Madar Saheb
|

Updated on: May 15, 2025 | 5:34 PM

Share

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అన్నారు.. ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు.. లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. పోస్టింగ్ అంటూ చెప్పారు.. వర్క్ ఫ్రం హోమ్ అన్నారు.. చివరకు అందరినీ మోసం చేశారు.. హైదరాబాద్‌లో మరో కంపెనీ నిరుద్యోగులను సాఫ్ట్‌గా మోసం చేసింది.. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు..

వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్యూరోపాల్ క్రియేషన్ & ఐటీ సొల్యూ షన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఆపై ఉద్యోగాలు ఇస్తామంటూ వలవేసింది కంపెనీ. బాధితుల నుండి విడతల వారీగా ఒక్కొక్కరి నుంచి 2 నుండి రెండున్నర లక్షల రూపాయల వరకూ వసూలు చేశారు నిర్వాహకులు.. వీరి మాటలు నమ్మి దాదాపు 200 మంది యువకులు డబ్బులు కట్టి కంపెనీలో చేరారు.

అయితే.. కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మించింది కంపెనీ యజమాన్యం.. చివరకు ట్రైనింగ్‌ ముగించిన తర్వాత కూడా ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చింది యాజమాన్యం.. దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు గచ్చిబౌలి వచ్చి చూడగా అక్కడ ఎలాంటి ఆఫీసు కనిపించలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడ్డామని.. చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.

ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 200 మంది మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు