AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎప్పుడు బయల్దేరనుందంటే.?

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎప్పుడు బయల్దేరనుందంటే.?
కాగా, విజయవాడ-చెన్నై వందేభారత్ రైలుకు మొదట వేరే రూట్ ఎంచుకోగా.. తిరుపతి మీదుగా నడిపితే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావించింది. దీంతో వయా రేణిగుంట నడపాలని విజయవాడ డివిజన్ అధికారులు.. దక్షిణ మధ్య రైల్వేను కోరిన విషయం విదితమే.
Ravi Kiran
|

Updated on: Jun 10, 2023 | 12:49 PM

Share

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. అది కూడా కేవలం జూన్ 10వ తేదీన మాత్రమే. ఈ మారిన టైమింగ్స్ ప్రయాణీకులు గమనించాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ రైలు.. ఇవాళ అనగా జూన్ 10న మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని రైల్వే శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తుండటం వల్ల ఈ మార్పుకు కారణమని తెలిపింది. కాగా, ఈరోజు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. 4 గంటలు ఆలస్యంగా ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరిన సంగతి తెలిసిందే.