AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makar Sankranti 2025: ఊరు పిలుస్తోంది..! తెలుగు పల్లెలకు సంక్రాంతి శోభ.. దారులన్నీ అటువైపే

సంక్రాంతికొస్తున్నాం. సిన్మాకాదు రియాలిటీ. లక్షలమంది ఒక్కసారి సొంతూరి బాట పడితే ఎలా ఉంటుంది. నేషనల్‌ హైవే కూడా కచ్చారోడ్డులా మారిపోయింది. గమ్యం దిశగా ప్రయాణం సాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి ఫీవర్. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జనం.. నిన్న సాయంత్రం నుంచే రద్దీగా మారిన రోడ్లు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెరిగిన రద్దీ. శని, ఆది వారాలు కలిసి రావడంతో మూడు రోజులు ముందుగానే ఊరిబాట పట్టిన జనం..

Makar Sankranti 2025: ఊరు పిలుస్తోంది..! తెలుగు పల్లెలకు సంక్రాంతి శోభ.. దారులన్నీ అటువైపే
Sankranthi
Shaik Madar Saheb
|

Updated on: Jan 11, 2025 | 9:41 PM

Share

సంక్రాంతి అంటేనే సందడి. సొంతూరికెళ్తేనే పెద్ద పండుగ మజా. అందుకే చలోచలో అంటూ సొంతూళ్లకు పయనమయ్యారు లక్షలమంది. బంధుమిత్రులతో సంక్రాంతిని ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబాలతో బయలుదేరారు. బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైలు బోగీల్లో కాలుపెట్టేందుకు కూడా స్థలం దొరకడం లేదు. చాలామంది సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కటంతో హైదరాబాద్​-విజయవాడ నేషనల్‌ హైవే సహా ముఖ్య రహదారులపై ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. శుక్రవారం రాత్రినుంచే వాహనాల రద్దీ పెరగటంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తున్నారు పోలీసులు. వాహనాల రద్దీతో విజయవాడ వైపు 10 టోల్‌బూత్‌లు తెరిచారు. సాధారణ రోజుల్లో 35వేల నుంచి 45వేల వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా వాటి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఒకవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షల మంది సొంతూళ్లకు క్యూకట్టారు. హైదరాబాద్‌-విజయవాడ హైవే హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. జిల్లాలకు వెళ్లే రహదారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రహదారులే కాదు.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాదే కాదు.. విజయవాడలోనూ ఇదే పరిస్థితి. విజయవాడకు చేరుకున్నాక అక్కడినుంచి తమ ప్రాంతాలకు తరలిపోతున్నారు సంక్రాంతి ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ 2 వేల 153 బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి