KTR: తెలంగాణకు మరోసారి గుండు సున్నా.. చంద్రబాబు కేంద్రాన్ని శాసిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

|

Jul 23, 2024 | 4:30 PM

తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది.. ఆర్థిక మంత్రి కనీసం తెలంగాణ పేరును కూడా పలకలేదు.. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?.. పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: తెలంగాణకు మరోసారి గుండు సున్నా.. చంద్రబాబు కేంద్రాన్ని శాసిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Ktr
Follow us on

తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది.. ఆర్థిక మంత్రి కనీసం తెలంగాణ పేరును కూడా పలకలేదు.. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?.. పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన కేటీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేలుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కి 8, బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు.. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ ఎద్దెవా చేశారు. లోక్‌సభలో గులాబీకండువా ఉండి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే.. యాచించి కాదు, శాసించి డిమాండ్లు సాధించుకోగలమన్నారు. 16మంది ఎంపీలతో చంద్రబాబు కేంద్రాన్ని శాసిస్తున్నారు.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. తెలంగాణ 16మంది ఎంపీలు నోరు మెదపలేదు అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని.. దక్కింది శూన్యమని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని పేర్కొన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదన్నారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని తాము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.

వీడియో చూడండి..

తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదన్నారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని.. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని కేటీఆర్ సూచించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలియజేస్తోందని తెలిపారు.

పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని.. ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు తమకు ఏం బాధ లేదన్నారు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన, వారు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరమంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..