AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చార్మినార్‌కు పగుళ్లు..డేంజర్లో చారిత్రక కట్టడం

పురాతన కట్టడం, భాగ్యనగరానికే తలమానికం అయిన చార్మినార్‌లోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. […]

చార్మినార్‌కు పగుళ్లు..డేంజర్లో చారిత్రక కట్టడం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2019 | 7:54 PM

Share

పురాతన కట్టడం, భాగ్యనగరానికే తలమానికం అయిన చార్మినార్‌లోని చిన్న భాగం కూలింది. నాలుగు మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపురాయి కట్టడం విరిగిపోయి కింద పడింది. ఆ సమయంలో చార్మినార్ వద్ద పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. ఈ విధంగా శుభ్రం చేసి, రంగు వేసిన ఒక మినార్ నుంచి చిన్న భాగం ఇప్పుడు కూలింది.

హైదరాబాద్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్‌. దేశ, విదేశీ పర్యాటకులు చార్మినార్‌ను చూడటానికి వస్తుంటారు. భాగ్యనగర నిర్మాత మహ్మద్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1591లో దీన్ని నిర్మించారు. అంటే చార్మినార్ నిర్మించి దాదాపు 428 సంవత్సరాలైంది. ఈ నిర్మాణానికి గల కారణాలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఎక్కువగా ప్రబలింది. ఆ వ్యాధి పూర్తిగా నయమైన శుభవేళను కలకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చార్మినార్‌ నిర్మాణం జరిగిందని కొందరు చెబితే.. కుతుబ్‌షాహీ పాలకుల విజయ వైభవానికి ప్రధాన సింహద్వారంలాగా చార్మినార్‌ నిర్మించారని ఇంకొందరు చెబుతున్నారు.