Hyderabad: హనీమూన్‌ కోసం ఇండోనేషియా వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జంట.. ఇంతలోనే ఊహించని ఘటన..

|

Jan 25, 2023 | 8:59 AM

హనీమూన్‌ కోసం ఇండోనేషియాకి వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం ఓ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. హైదరాబాద్‌లోని అల్కాపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

Hyderabad: హనీమూన్‌ కోసం ఇండోనేషియా వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జంట.. ఇంతలోనే ఊహించని ఘటన..
Scuba Diving Death
Follow us on

హనీమూన్‌ కోసం ఇండోనేషియాకి వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హఠాన్మరణం ఓ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. బాలిలో స్కూబా డైవింగ్ కు వెళ్లి హార్ట్ స్ట్రోక్ కు గురై హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ అల్కాపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వంశీకృష్ణకు గత ఏడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. గ్రూప్‌ వన్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి అర్హత సాధించి, మెయిన్స్‌ రాసేందుకు సంసిద్దమవుతున్నాడు వంశీ కృష్ణ. బిజీ జీవితంలో కాస్తంత ఊరట కోసం ఈ నెల 13న భార్య శ్రావణి తో కలిసి ఇండోనేషియా వెళ్ళారు వంశీ. బాలికి కొంత దూరంలో ఉన్న పెన్నిడా ఐలాండ్‌ని చూసేందుకు వెళ్ళిన ఈ యువ జంట అక్కడ బస చేశారు. ఈనెల 22న ఉదయం 20 మంది పర్యాటకులతో కలిసి పెన్నిడా ఐలాండ్‌ సముద్ర భాగంలో అక్వేరియం చేపలు చూసేందుకు వెళ్ళారు.

ముగ్గురు గైడ్‌లు ఒకేసారి సముద్రంలోకి దిగారు. అందులో వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఆక్సిజన్‌ మాస్క్‌, డైవింగ్‌ షూస్‌ అన్నీ పెట్టుకొని వంశీ సముద్రంలోకి దిగాడు. అంతలోనే సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహాన్ని గుర్తించారు. రేపు సాయంకాలానికి వంశీ మృతదేహం హైదరాబాద్‌కి చేరుకోనున్నట్టు వంశీ కుటుంబ సభ్యులు తెలిపారు.

భవిష్యత్తు మీద అంతులేని ఆశలతో కష్టపడి చదివి, సివిల్స్‌ ప్రలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించి.. అంతలోనే కనుమరుగైన వంశీకృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి పెన్నిడా ఐలాండ్‌ నుంచి ఆదివారమే తిరిగి వంశీ కృష్ణ బాలికి వచ్చేయాల్సి ఉంది. అయితే అక్కడి గైడ్‌ సముద్రంలోపలకి వెళితే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుందని పదే పదే చెప్పడంతో సముద్రలోకి దిగి, హార్ట్‌ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..