AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోయిన్‌పల్లిలో 8వేల కిలోల వెండి పట్టివేత

బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌ సమీపంలో భారీగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 8వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్‌ను సీఐ రాజేష్‌ తన బృందంతో గుర్తించారు. లండన్‌ నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెండి కడ్డీల విలువ సుమారు రూ.35 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటికి బిల్లులు ఉన్నాయా? లేక అక్రమంగా తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బోయిన్‌పల్లిలో 8వేల కిలోల వెండి పట్టివేత
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2019 | 2:50 PM

Share

బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌ సమీపంలో భారీగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 8వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్‌ను సీఐ రాజేష్‌ తన బృందంతో గుర్తించారు. లండన్‌ నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వెండి కడ్డీల విలువ సుమారు రూ.35 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటికి బిల్లులు ఉన్నాయా? లేక అక్రమంగా తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.