AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ ఇంటి పెరట్లో నుంచి మత్తైన వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చెక్ చేయగా..

అయ్యగారు పెరట్లోనే సెటప్ పెట్టేశాడు. ఏపైన గంజాయి మొక్కలను పూల కుండీల్లో పెంచేశాడు. వాటంగా ఎదిగిన మొక్కల నుంచి వీధిలోకి అదో రకమైన వాసన వస్తుంది. అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Hyderabad: ఆ ఇంటి పెరట్లో నుంచి మత్తైన వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చెక్ చేయగా..
Marijuana
Ram Naramaneni
|

Updated on: May 22, 2023 | 9:23 PM

Share

మత్తు యవ్వారం మహా మాయ చేస్తుంది. మందుకి అలవాటు పడ్డవాళ్లు సాయంత్రం అవ్వగానే.. వైన్ షాపుల వైపు చూస్తుంటారు. డైలీ అదే పనిలో ఉండే బ్యాచ్ కూడా ఉంటుంది. మందు పక్కనబెడితే ఈ మధ్య గంజాయి పెను ముప్పుగా మారింది. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికేస్తుంది. రేటు తక్కువ.. ఇచ్చే కిక్కు ఎక్కువ. దీంతో చాలామంది యూత్‌.. గంజాయివైపు అడిక్ట్ అయ్యారు. సీరియస్‌గా తీసుకున్న సర్కార్ గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. కొంచెం అనుమానం ఉన్నా మెరపు దాడులు చేస్తున్నారు. దీంతో ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ యువకుడు వనస్థలిపురం పరిధిలోని గాంధీనగర్‌లో గల ఇంట్లోనే పెరట్లో గంజాయి మొక్కల పెంపకం షురూ చేశాడు.

దీనిపై పోలీసులకు ఉప్పు అందింది. ఎల్బీ నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, వనస్థలిపురం పోలీసులు అకస్మాత్తుగా అతడి ఇంటికి సోదాలు చేశారు. వచ్చిన సమాచారం నిజమైంది. పూల మొక్కల మధ్యలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను అధికారులు గుర్తించారు. 10 మొక్కలను పెకలించి.. స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 300 గ్రాముల గంజాయి విత్తనాలు కూడా సీజ్ చేశారు. నిందితుడు రేవంత్ వర్మను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువకుడు గంజాయికి బానిసయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..