Hyderabad: అయ్యో పాపం.. సండే అని చేపలు పట్టేందుకు వెళ్లిన ఫ్రెండ్స్.. గాలం వేసిన కాసేపటికే..
హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగర శివారులోని గండిపేట చెరువులో పడి ముగ్గురు యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవుదినం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గండిపేట చెరువు దగ్గరకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయం దిగువన మూసీలో ప్రమాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. బయటకు రాలేకపోయిన వారు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి రోజు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పొస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్కి చెందిన కార్తీక్, గోవర్ధన్, వెంకటేష్ అనే ముగ్గురు యువకులు ఆదివారం సెలవు దినం కావడంతో స్థానికంగా ఉన్న గండిపేట జలాశయంలో సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ముగ్గురు యువకులకు ఈత రాకపోవడంతో నీటి నుంచి బయటకు రాలేకపోయారు. చుట్టు పక్కల కాపాడడానికి కూడా ఎవరూ లేకపోవడంతో వారు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
అయితే రాత్రైన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం మొదలు పెట్టారు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగన పోలీసులు చిన్నారులు చేరువులో చేపలు పట్టేందుకు వెళ్లినట్టు తెలుసుకున్నారు. మార్నింగ్ రెస్క్యూ బృందాలతో కలిసి గాలింపు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
