NCRB: ఆర్థిక నేరాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. NCRB నివేదికలో కీలక విషయాలు..
ఇదిలా ఉంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 6,015 ఆర్థిక నేరాలతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇక 5007 ఆర్థిక నేరాలతో మూడో స్థానంలో ఉంది. ముంబయిలో నమోదైన మొత్తం ఆర్థిక నేరాల్లో 1,093 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కేసులు కాగా.. 5,855 ఫోర్జరీ, చీటింగ్ వంటి కేసులు నమోదయ్యాయి. 2022లో మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన 18 కేసుల విలువ రూ. 10 నుంచి రూ. 15 కోట్లు, 7 కేసులు...
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. 2022లో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దేశంలోనే అత్యధికంగా 6,960 ఆర్థిక నేరాలు జరిగినట్లు తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. ముంబయిలో సైబర్ నేరాలు కూడా 2021లో 2,883 నమోదుకాగా, 2022 నాటికి 4,724కి పెరిగాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్సీఆర్బీ పేర్కొంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 6,015 ఆర్థిక నేరాలతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇక 5007 ఆర్థిక నేరాలతో మూడో స్థానంలో ఉంది. ముంబయిలో నమోదైన మొత్తం ఆర్థిక నేరాల్లో 1,093 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కేసులు కాగా.. 5,855 ఫోర్జరీ, చీటింగ్ వంటి కేసులు నమోదయ్యాయి. 2022లో మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన 18 కేసుల విలువ రూ. 10 నుంచి రూ. 15 కోట్లు, 7 కేసులు రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లు, 6 కేసులు విలువ రూ. 50 కోట్లు, రూ. 100 కోట్లు కాగా ఒక కేసు రూ. 100 కోట్లుగా ఉంది.
ఇక గతేడాది మహారాష్ట్రాలో నమోదైన మొత్తం సైబర్ క్రైమ్ కేసుల్లో 2,530 మహిళలపై జరిగినవేనని, ఇందులో 578 సైబర్ స్టాకింగ్/ బెదిరింపు నేరాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. మెట్రోపాలిటన్ నగరాల విషయానికొస్తే.. 9,940 కేసులతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, 4,724 కేసులతో ముంబయి రెండో స్థానం, 4436 కేసులతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ముంబయిలో గత మూడేళ్లలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని నివేదిక చెబతోంది. 2020లో 2,433 నుంచి 2021లో 2,883కి, 2022లో 4,724కి పెరిగాయని నివేదిక పేర్కొంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..