Hyderabad: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన పోలీసులు.. మట్టారెడ్డి సహా ఐదుగురి అరెస్ట్

Hyderabad Crime News: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు చేధించారు. రెండు రోజుల వ్యవధిలో కీలక

Hyderabad: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన పోలీసులు.. మట్టారెడ్డి సహా ఐదుగురి అరెస్ట్
Hyderabad
Follow us

|

Updated on: Mar 03, 2022 | 11:38 AM

Hyderabad Crime News: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు చేధించారు. రెండు రోజుల వ్యవధిలో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్లు శ్రీనివాసరెడ్డి, రాఘవేందర్ రెడ్డి లను దుండగులు ఇబ్రహీంపట్నం కర్ణగూడ వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ జంట హత్యల కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. మట్టారెడ్డి గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. సపారీ గ్యాంగ్ సాయంతో మట్టారెడ్డి ఈ హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మట్టారెడ్డి, నవీన్‌ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరిని సాయంత్ర మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల ల్యాండ్ కొన్నాడు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి కబ్జా చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్‌, మరో వ్యక్తితో కలిసి సైట్‌ దగ్గరికి వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మట్టారెడ్డి, అతని అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి పై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో శ్రీనివాస్‌ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు.. రఘుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతణ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే.. ఇరు కుటుంబాలు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. అయితే.. మట్టారెడ్డి సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read:

YS Viveka Murder Case: జగన్ అలా చెప్పేవారు.. వివేకా హత్య కేసుపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

Hyderabad: బైక్ రేసింగ్‌లతో యువకుల హల్‌చల్‌.. భాగ్యనగరంలో 8 మంది అరెస్టు