AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజరస్‌గా మారిన భాగ్యనగరం.. ఇక్కడ గాలి పీలిస్తే అంతే..

వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి మన హైదరాబాద్‌ సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయాన్నే జాగింగ్, మార్నింగ్ వాక్ చేసేవాళ్లకు ఊపిరి పీల్చుకోవడం […]

డేంజరస్‌గా మారిన భాగ్యనగరం.. ఇక్కడ గాలి పీలిస్తే అంతే..
Ravi Kiran
|

Updated on: Nov 25, 2019 | 5:09 PM

Share

వాయు కాలుష్యం.. ఇప్పుడు మెట్రోపాలిటిన్ సిటీస్ అన్నింటికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు అదే కోవలోకి మన హైదరాబాద్‌ సైతం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలతో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయాన్నే జాగింగ్, మార్నింగ్ వాక్ చేసేవాళ్లకు ఊపిరి పీల్చుకోవడం కాస్త ఇబ్బందిగా మారింది. ఇక ఈ చల్లని వాతావరణంలో స్వైన్ ఫ్లూను వ్యాపించే వైరస్, బ్యాక్తీరియాలు ఎన్నో వృద్ధి చెందుతాయని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు, ఆస్తమా పేషెంట్స్‌లకు చాలా ప్రమాదకరమని వారి వాదన.

ఇక హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. నవంబర్ 22కి అది 158గా నమోదైంది. బేగంపేట, బాలానగర్, నెహ్రూ జూలాజికల్ పార్క్, జీడిమెట్ల, ఆబిడ్స్, పంజాగుట్ట వంటి ప్రదేశాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు గాలిలో సల్ఫర్ డయాక్సయిడ్, హైడ్రో కార్బన్స్, అమోనియం కార్బో మోనాక్సయిడ్ వంటి రసాయనాలు పొగ మంచుతో కలిసిపోవడం వల్ల ప్రజలు గాలి పీల్చుకునేటప్పుడు ఇవన్నీ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల.. శ్వాస సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

అందుకే బయటికి వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎక్కువగా గ్రీనరీ ఉండే ప్రదేశాల్లో గడిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం