Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. మార్చి 8న ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.!
హైదరాబాద్ వాసులారా.! జర ఇది వినండి.. మార్చి 8వ తేదీన అనగా శనివారం నాడు మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. దీనిపై జలమండలి కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఇది కీలక అలెర్ట్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాదీలకు ముఖ్య అలెర్ట్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్నవారు ఇది తప్పక చదవాల్సిందే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేలా ఎన్హెచ్ఎఐ వినతి మేరకు అక్కడున్న జలమండలి పీఎస్సీ పైప్ లైన్ను వేరే చోటకి మార్చనుంది.
బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న 1500 ఎంఎం డయా పైప్లైన్కు జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మార్చి 8వ తేదీన అనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. దీంతో ఈ 12 గంటల పాటు బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల నీటి సరఫరాలో అంతరాయం.. అలాగే మరికొన్ని చోట్ల లో-ప్రెజర్తో నీటి సరఫరా జరగనుంది. మరి ఆ ఏరియాలు ఏంటన్నది చూసేద్దాం..
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పాడే ప్రాంతాలు..
- ఓ అండ్ ఎం డివిజన్ – 6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్
- ఓ అండ్ ఎం డివిజన్ – 9: కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట
- ఓ అండ్ ఎం డివిజన్ – 17: ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్
- ఓ అండ్ ఎం డివిజన్ – 22: దీప్తి శ్రీ నగర్, బీరంగూడా, అమీన్ పూర్, నిజాంపేట్
పైన పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో.. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు నీటిని శనివారం(మార్చి8) నాడు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి