AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదం ఘటన.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయని భట్టి విక్రమార్క తెలిపారు.

Hyderabad: గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదం ఘటన.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
Bhatti Vikramarka
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2025 | 3:51 PM

Share

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌ ఉస్మానికియా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గుల్జార్‌ హౌస్‌ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు.

అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయని భట్టి విక్రమార్క తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం అధికారులతో మాట్లాడారన్నారు. సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయ అందిస్తామని తెలిపారు.

చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఘటనపై రాజకీయాలు చేయవద్దని, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

క్షతగాత్రులను, మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ కోరారు.

అగ్నిప్రమాద ఘటన జరగడం దురదృష్టకరమని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. మృతులకు సంతాపం తెలిపారు హైదరాబాద్‌ ఎంపీ.. బాధిత కుటుంబం వందేళ్లకుపైగా ఇక్కడే నివసిస్తోందని.. ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!