AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త వద్దు.. ప్రియుడు ముద్దు.. తెలంగాణలో చంపింది.. కర్ణాటకలో కాల్చింది.. ఇది మామూలు స్టోరీ కాదు..

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌ను ఆయన భార్య నీహారిక, ఆమె ప్రియుడు నిఖిల్ కలిసి హత్య చేశారు. 8 కోట్ల విలువైన ఆస్తి కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో హత్య జరిగితే, మృతదేహాన్ని కర్ణాటకలో కాల్చివేశారు. పోలీసుల విచారణలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

భర్త వద్దు.. ప్రియుడు ముద్దు.. తెలంగాణలో చంపింది.. కర్ణాటకలో కాల్చింది.. ఇది మామూలు స్టోరీ కాదు..
Telangana Crime
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 9:45 AM

Share

ఆమెకు పెళ్లయింది.. భర్త పెద్ద వ్యాపారస్తుడు.. 8 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉంది.. కట్ చేస్తే.. మళ్లీ ఆమెకు ఓ ప్రియుడు కూడా ఉన్నాడు.. ఇలా చివరకు.. భర్త వద్దు.. ప్రియుడు ముద్దు అని నిర్ణయించుకుంది.. ఆ తర్వాత ఆస్తిపై కన్నేసి.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ మహిళ.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి దారుణ హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది.. ప్రియుడితో కలిసి తెలంగాణలో భర్తను హత్య చేసిన భార్య.. అతని శవాన్ని కర్నాటకలో తెగలబెట్టింది.

హైదరాబాద్‌కి చెందిన వ్యాపార వేత్త రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉప్పల్- భువనగిరి ప్రాంతంలో హత్య చేసి.. డెడ్‌ బాడీని కర్నాటకలోని కొడగు కాఫీ ఎస్టేట్‌లో తగుల బెట్టారు. రమేష్ హత్యకు అతని భార్య నీహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కారణమని గుర్తించారు పోలీసులు. కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు.. మర్డర్‌కి సంబంధించిన విషయాలపై కూపీ లాగారు.

భువనగిరి ప్రాంతంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిహారిక.. డెడ్ బాడీని మెర్సిడెస్ బెంజ్ కార్‌లో హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలించింది.. హర్యానాకు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో.. ఇద్దరూ కలిసి ఊటీ దగ్గర ఉన్న కాఫీ ఎస్టేట్‌కి తీసుకెళ్లారు. అక్కడ రమేష్ శవాన్ని తగలబెట్టారు. సగం కాలిన శవాన్ని గుర్తించిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

అయితే.. విచారణలో దిమ్మతిరిగేలా వాస్తవాలు వెలుగుచూశాయి.. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే తన భర్తను నీహారిక చంపినట్లు విచారణలో తేల్చారు కర్ణాటక పోలీసులు. రమేష్ డెడ్‌ బాడీని తగులబెట్టిన రాణా అనే నిందితుడిని హర్యానా లోని ఓ డాబా దగ్గర టీ తాగుతుండగా అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు.

వ్యాపార వేత్త రమేష్‌ది హైదరాబాద్ కాగా.. భార్య నిహారికది యాదాద్రి జిల్లా. ఆమె ప్రియుడు నిఖిల్ స్వంతూరు కడప జిల్లాగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..