AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ ఇయర్ నుండి డీఏను 2.1శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా ప్రభుత్వం నిర్ణయంతో ఇంతకు ముందు 50.7 శాతం ఉన్న DA ఇపుడు 52.8శాతానికి పెరగనుంది. ఈ పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు.

Telangana: ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు!
Tgsrtc Da Hike
Anand T
|

Updated on: Apr 10, 2026 | 11:45 AM

Share

తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని 2.1శాతాన్ని పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన డీఏను జనవర్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా వీటిని ప్రభుత్వం చెల్లించనుంది. అయితే పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల రూ. 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయితే చివరగా జూలై 2025 లో ప్రభుత్వం 2.1శాతం DA పెంచించింది. అప్పుడు 48.6 శాతంగా ఉన్న డీఎను 50.7శాతానికి ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏతో ఇది 52.8కి చేరింది. అయితే మే 2024 లో RPS – 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవు.

డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డీఏ ప్రకటించడం పట్ల అటు ఉద్యోగులు సైతం మంత్రితోపాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్‌లో ఆర్ ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని తెలిపారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టిసీ సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌