కోదాడ సమీపంలో ఆటోను ఢీ కొన్న లారీ.. ఏడుగురు మృతి
సూర్యపేట : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని ఆలయం బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. ఓ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. సూర్యపేట జిల్లా కోదాడ మండలం తుమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఖమ్మం నుంచి కోదాడవైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదపు సమయంలో ఆటోలో 9 మంది ప్రయాణికులు ఉన్నట్టు […]
సూర్యపేట : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని ఆలయం బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. ఓ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. సూర్యపేట జిల్లా కోదాడ మండలం తుమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఖమ్మం నుంచి కోదాడవైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదపు సమయంలో ఆటోలో 9 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.