Telangana Panchayat Elections 2025 Highlights: తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్..
Telangana Gram Panchayat Polls 2025 Phase 1 Live Updates in Telugu: సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.

రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగుతుంది. అదేవిధంగా 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది పోటీ పడుతుండగా.. 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓట్ల లెక్కింపు..
మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడిస్తారు. సాయంత్రంలోపే ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు
LIVE NEWS & UPDATES
-
ఓటేసి.. ప్రాణం వదిలిన ఓటరు! ఎక్కడంటే..
బ్యాలెట్ పేపర్ను డబ్బాలో వేసి వెనుతిరిగి వెంటనే ఓ వృద్ధుడు తనువు చాలించిన ఘటన నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. చెరుపల్లి బుచ్చయ్య(69) గురువారం ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ గదిలోకి వెళ్లి ఓటు వేసి స్పృహ కోల్పోయి ఆ ఆవరణలోనే పడిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు. బుచ్చయ్య 20 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-
ఇప్పటి వరకు గెలిచిన మొత్తం సర్పంచి అభ్యర్ధులు వీరే
కాంగ్రెస్ సర్పంచి అభ్యర్ధులు 1830 మంది, BRS సర్పంచి అభ్యర్ధులు 921, BJP సర్పంచి అభ్యర్ధులు 149, ఇతరులు 410 మంది ఇప్పటి వరకు గెలుపొందారు.
-
-
యాదాద్రిలో ఉద్రిక్తత.. ఓట్ల లెక్కింపులో ఇరువర్గాల ఘర్షణ
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో ఉద్రిక్తతత నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఘర్షణ తలెత్తడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
-
అదృష్టాన్ని తిరగరాసిన ఒకే ఒక్క ఓటు.. వీడిన ఉత్కంఠ
మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపుర్లో ఒకే ఓటు తేడాతో ప్రత్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్ధి బేగరి పండరి సర్పంచ్గా గెలుపొందారు.
-
రీకౌంటింగ్లోనూ సమానంగా ఓట్లు.. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలో జరిపిన రీకౌంటింగ్లోనూ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేయాగా.. కాంగ్రెస్ అభ్యర్ధి మరాఠి రాజ్కుమార్ గెలుపొందినట్లు ప్రకటించారు.
-
-
ఒక్క ఓటు తేడాతో పరందోలి స్వతంత్ర అభ్యర్థి పుష్పలత గెలుపు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలుపొందారు.
-
దామరవంచ సర్పంచ్ ఫలితాల్లో ఉత్కంఠ
చండూరు మండలం శిరిదేపల్లి గ్రామ సర్పంచ్గా దామెరా రాములు (BRS ) 236 ఓట్లతో విజయం సాధించారు. ఇక మహబూబాబాద్ గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మొదట 3 ఓట్లతో BRS అభ్యర్ధి స్వాతి గెలుపొందగా.. రీకౌంటింగ్లో కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మళ్లీ రీకౌంటింగ్ చేపట్టారు.
-
గొల్లగూడెంలో 30 ఓట్ల తేడాతో BRS అభ్యర్ధి రజిత విజయం
నల్గొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం సర్పంచిగా BRS అభ్యర్ధి రావుల రజిత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇటిక శ్రావణిపై 30 ఓట్లతో గెలుపొందారు.
-
కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి స్వగ్రామంలో రీకౌంటింగ్..!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో BRS అభ్యర్ధి రేవతికి 6 ఓట్లు ఆధిక్యం రావడంతో రీకౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి డిమాండ్ చేశారు. దీతో పోలింగ్ అధికారులు రీకౌంటింగ్ చేస్తున్నారు.
-
ఓటమి తట్టుకోలేక.. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి!
వికారాబాద్లో కొండగల్ మండలం ఖాజాహైమద్పల్లిలో సర్పంచి అభ్యర్ధిగా పోటీ చేసిన ఓటమి లక్ష్మి ఓటమి పాలైంది. దీంతో ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి పురుగుల మందు తాగింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
-
బద్యాతండా ఓట్ల లెక్కింపులో టెన్షన్.. టెన్షన్..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. మొదట ఒకేఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్ధి సర్పంచిగా గెలిచినట్టు ప్రకటించారు. రెండోసారి రీకౌంటింగ్లో 3 ఓట్ల తేడాతో BRS అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఆందోళనతో అధికారులు మూడోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు.
-
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్..
తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఈ రోజు జరిగిన పోలింగ్లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు స్థానాలకు, 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఏకగ్రీవంతో కలిపి కాంగ్రెస్ అభ్యర్ధులు 776 మందికిపైగా సర్పంచ్లుగా గెలుపొందారు. BRS అభ్యర్థులు 312 మంది, BJP 63 మంది, ఇతరులు 164 మంది ఇతరులు గెలుపొందారు.
-
జిల్లాల వారీగా తొలి విడత పోలింగ్ వివరాలు ఇవే
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ 82.26 శాతం
- జనగామ జిల్లాలో పోలింగ్ 78.57 శాతం
- ఆసిఫాబాద్ జిల్లాలో 77.07 శాతం
- పెద్దపల్లి జిల్లాలో శాతం 82.27 శాతం
- సంగారెడ్డి జిల్లాలో 84.71 శాతం
- హనుమకొండలో 81.39 శాతం
- నల్లగొండ జిల్లాలో 81.63 శాతం
- ఖమ్మం జిల్లాలో 86.95 శాతం
- సూర్యాపేట జిల్లాలో 89.69 శాతం
- మహబూబ్ నగర్ జిల్లాలో 83.04 శాతం
- మహబూబాబాద్ జిల్లాలో 86.99 శాతం
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78.58 శాతం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం
-
ఇద్దరు సర్పంచి అభ్యర్ధులకు సమానంగా ఓట్లు.. లాటరీతో సర్పంచి ఎంపిక
యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో ఇద్దరు సర్పంచి అభ్యర్ధులకు సమానంగా 148 ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీశారు. లాటరీలో BRS అభ్యర్ధి ఇండ్ల రాజయ్యను విజయం వరించింది.
-
మహబూబ్నగర్ జిల్లాలో BRS అభ్యర్ధుల హవా
మహబూబ్నగర్ జిల్లాలో పలు చోట్ల BRS అభ్యర్ధులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్ఎస్ అభ్యర్ధి సోమ్లా, మహబూబ్నగర్ తువ్వగడ్డ తండాలో చాందిని శంకర్ గెలుపొందారు. అలాగే రాజాపూర్ మండలంలోని రాఘవపూర్, దోండ్లపల్లి, చొక్కం పేట్, కుతినేపల్లి, కోర్ర తండా, రంగారెడ్డి పల్లి, లాల్యా నాయక్ తండ, వెల్డండ మండలం పోతేపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు.
-
నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్ధులు
- వర్ని మండలం కూనిపూర్లో బోయిని లక్ష్మణ్
- మోస్రా మండలం దుబ్బా తండాలో లూనావత్ శివ
- పోతంగల్ మండలం హెడ్డోలిలో సీనియర్ జర్నలిస్టు వాసు (ఇండిపెండెంట్)
- పోతంగల్ మండలం తిరుమలపూర్లో విజయ్
- బోధన్ మండలం మీనార్ పల్లిలో మూడు పద్మ తారాచంద్
-
ఆదిలాబాద్ జిల్లాలో గెలుపొందిన అభ్యర్ధులు వీరే
ఆదిలాబాద్ జిల్లాలో..
- ఇచ్చోడ మండలం అడేగామ కే గ్రామంలో అనూష
- ఉట్నూర్ మండలం లింగోజీతాండాలో జాదవ్ మాయ హరినాయక్
- పులిమడుగులో అడె లిలాబాయి
- కోత్తగూడ ( G)లో తోడసం బీంబాయి (ఇండిపెండెంట్)
- కన్నాపూర్లో నైతం దైర్యవంతి (ఇండిపెండెంట్)
- నాగపూర్లో కల్పణ సునీల్
- నడ్డంగూడలో చౌవన్ సుశీల బాయి
-
కామారెడ్డి జిల్లాలో గెలుపొందిన అభ్యర్ధులు
కామారెడ్డి జిల్లాలో
- తాడ్వాయి మండలం కాళోజివాడిలో బద్దం చంద్రారెడ్డి
- రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో లలిత
- భిక్కనూర్ మండలం గుర్జకుంటలో సామ సంతోష్ రెడ్డి
- నవీపేట మండలం హనుమాన్ ఫారంలో నర్రా వంశీ మోహన్
- పల్వంచ మండలం ఆరేపల్లిలో భూమయ్య
- భిక్కనూరు మండలం మల్లుపల్లిలో మాలె నారాయణ
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో BRS సర్పంచ్ గెలుపు
రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో BRS సర్పంచ్ అభ్యర్థి రేవతి 6 ఓట్లతో విజయం సాధించారు.
-
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల సత్తా
ఇప్పటి వరకు కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు 513 మంది, బీఆర్ఎస్ అభ్యర్ధులు 164 మంది, బీజేపీ 19 మంది ఇప్పటి వరకు సర్పంచులుగా ఎన్నికయ్యారు
-
పాటిమీది తండా, బండేయేర్లో స్వతంత్ర అభ్యర్ధుల గెలుపు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పాటిమీది తండాలో స్వతంత్ర అభ్యర్థి అపవాత్ రాజు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బండేయేర్ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
-
మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త సర్పంచులు
- మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట్ మండలం హన్మంత్పల్లి సర్పంచ్ గా చేదం మల్లేష్
- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ సర్పంచ్గా లత రాథోడ్, కాల్వ శ్రీరాంపూర్ మండలం ఈప్పల పల్లిలో జిన్నా రామ్ చంద్ర రెడ్డి, నిర్మల్ జిల్లా మామడ మండలం నల్లుర్తి గ్రామంలో సుధారి సునీత, రాయదారి గ్రామలో స్వతంత్ర అభ్యర్థి బంక తిరుపతి, పోట్టపల్లిలో చింతకింది ముఖేష్ గెలుపొందారు.
-
ఖమ్మం జిల్లాలో పలు వార్డుల్లో కొత్త సర్పంచులు వీరే
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోర్లబోడుతండా లో భూక్య చిన్నయ్య, కొనిజర్ల మండల పరిధిలోని మేకలకుంట గ్రామపంచాయతీలో భూక్య అనిత, మధిర మండలం వెంకటాపురం పరుచూరి హరినాథ్, కొనిజర్ల మండల పరిధిలోని గద్దలగూడెం భూక్య రామ్ లాల్ సర్పంచులుగా గెలిచారు.
-
నాగపూర్, గౌరారం వార్డుల్లో అభ్యర్ధులకు సమాన ఓట్లు..
సంగారెడ్డి మండలం నాగపూర్లో వార్డ్ నెంబర్ మూడులో అర్చన, విజయ లక్ష్మికి 30 సమాన ఓట్లు వచ్చాయి. టాస్ వేయగా విజయలక్ష్మి గెలుపు కైవసం చేసుకున్నారు. అలాగే గౌరారం రెండో వార్డులో అభ్యర్థులు ఇద్దరికీ సమాన మెజారిటీ వచ్చింది. రాజేందర్, పసుల వెంకటయ్యలకు సమానంగా 67 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీశారు. ఇందులో వెంకటయ్య విజయం సాధించారు.
-
లచ్చగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్ధి రజిని గెలుపు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్ధి కొప్పుల రజిని గెలుపు
-
ఖమ్మం, సిద్దిపేట, మంచిర్యాల, కామారెడ్డిలో కొత్త సర్పంచులు వీరే
- ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలెం కాంగ్రెస్ అభ్యర్థి బోద్దుకోళ్ళ పుష్ప గెలుపు
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం షాకారం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గోరేమియా 7 ఓట్ల తేడాతో గెలుపు
- కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం షాబ్దిపూర్ తండా కాంగ్రెస్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ గెలుపు
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి BRS అభ్యర్థి వెన్నెల భాను గెలుపు
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బంగారు తండాలో భుక్య నిర్మల బాయి గెలుపు
- హాజీపూర్ మండలం నాగారంలో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్రం మహేశ్వరి 22 ఓట్ల మెజారిటీతో గెలుపు
-
KCR తాండ, ASR తండాలో ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఘన విజయం
మెట్పల్లి మండలం కేసీఆర్ తాండ సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మంజుల, ఎ.ఎస్.ఆర్.తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ గెలుపు
-
మొండిగుట్ట, ఆదర్శ నగర్ గ్రామాల్లో సర్పంచులుగా ఇద్దరు లక్ష్మిలు
నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామ సర్పంచ్ గా ఉప్పెర లక్ష్మీ, ఆదర్శ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బర్కుంట లక్ష్మి సర్పంచులుగా గెలిచారు.
-
తిమ్మాపూర్ తండాలో ఇండిపెండెంట్ అభ్యర్థి లత గెలుపు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచిగా ఇండిపెండెంట్ అభ్యర్థి మేఘావత్ లత గెలుపొందారు.
-
నిర్మల్ జిల్లాలో కొత్త సర్పంచులు వీళ్లే..
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గ్రామాల్లో వేణునగర్: భీమ్ రావు, పెంబి తండా: గంగాధర్, ఇటిక్యాల తండా: చంద్ర బాను, శెట్పెల్లి: విట్టల్, దొందారి: గంగుబాయ్, పుల్గం పాండ్రి: నంద్యా నాయక్, పసపుల: గుగ్లావత్ సంతోష్ సర్పంచులుగా గెలిచారు.
-
ఒక్క ఓటు తేడాతో BRS సర్పంచి అభ్యర్ధి గెలుపు.. ఎక్కడంటే?
నల్గొండలో మద్దిరాల మండలం తూర్పుతండాలో ఒక్క ఓటు తేడాతో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు.
-
తిమ్మయ్యపల్లెలో తల్లిపై కూతురు విజయం
కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లిపై కూతురు విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత ఆమె తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
-
రాఘవాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి చిరంజీవి విజయం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురం సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి దారావత్ చిరంజీవి విజయం సాధించారు.
-
కొండపాకని గూడెంలో మల్లేష్, చిప్పలపల్లిలో అంజిరెడ్డి గెలుపు
కొండపాకని గూడెం భారతరాష్ట్రసమితి పార్టీ దాసరి మల్లేష్ 63 ఓట్లతో, చిప్పలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండ అంజిరెడ్డి 29 ఓట్లతో గెలుపొందారు.
-
రాఘవాపురం, సారగండ్లగూడెంలో సర్పంచ్లుగా కాంగ్రెస్ అభ్యర్ధులు ఎన్నిక
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురం సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి దారావత్ చిరంజీవి, ఆత్మకూరు ఎం మండలం సారగండ్లగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి చలమయ్య విజయం.
-
బెక్కర గ్రామంలో భీమమ్మ, జంగారెడ్డి పల్లిలో రామకృష్ణారెడ్డి విజయం
కల్వకుర్తి మండలం బెక్కర గ్రామ సర్పంచ్గా భీమమ్మ , అదే మండలం జంగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్గా రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
-
గొల్లగూడెం సర్పంచిగా BRS, గౌతపూర్లో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు
చండూరు మండలం గొల్లగూడెం సర్పంచిగా భారత రాష్ట్ర సమితి రావుల రజిత విజయం సాధించారు. తాండూర్ మండలం గౌతపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి శోభారాణి 29 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకున్నారు.
-
తుర్కాశి నగర్లో BRS, బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
వేములవాడ గ్రామీణ మండలం తుర్కాశి నగర్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి షేక్ షాదుల్లా గెలుపొందారు. తుంగతుర్తి మండలం బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ బికోజి గెలుపొందారు.
-
మాందాపూర్, జయవరంలో సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మాందాపూర్ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి లింగాల మౌనిక, వేములవాడ మండలం జయవరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంద్రాల ప్రసాద్ గెలిచారు.
-
సిద్దిపేట జిల్లా గణేష్ పల్లిలో BRS అభ్యర్ధి రామరాజు గెలుపు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లిలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి రామరాజు 40 ఓట్ల తేడాతో విజయం
-
చింతలకుంట తండా, చింతామణిపట్నంలో BRS సర్పంచులు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తండా సర్పంచ్గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జాటోతు రవి గెలుపు కైవసం చేసుకున్నారు. తాండూరు మండలం చింతామణిపట్నంలో భారత రాష్ట్ర సమితి సర్పంచ్ అభ్యర్థి కురువ మౌనిక 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
-
తువ్వగడ్డ తండా సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్ధి చాంది బాయి గెలుపు
మహబూబ్ నగర్లో తొలి ఫలితం విడుదలైంది. అక్కడి తువ్వగడ్డ తండా సర్పంచ్గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చాంది బాయి విజయం సాధించారు.
-
భద్రాచలంలో ఇంకా మొదలవ్వని కౌంటింగ్..!
పెద్దపల్లి జిల్లా కామన్ పూర్లో 3:18కి ఆలస్యంగా ఎన్నికల లెక్కింపు మొదలైంది. ఇక భద్రాచలంలో లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు.
-
ఊరేంటి తండాలో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం
పెద్దెముల్ మండలం ఊరేంటి తండాలో సర్పంచ్గా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సువర్ణ విజయం సాధించారు.
-
వికారాబాద్ జిల్లా ఖాజాపూర్లో కాంగ్రెస్ సత్తా
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఖాజాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ రామిరెడ్డి 98 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
-
ర్యాగట్లపల్లి గ్రామంలో BRS అభ్యర్థి భాగ్యమ్మ గెలుపు
భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థి గెలుపు కైవసం చేసుకున్నారు. ధర్మగారి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో సర్పంచ్గా సమీప అభ్యర్థి లక్ష్మిపై విజయం సాధించారు.
-
పల్లెల్లో విజేతలుగా నిలిచిన సర్పంచ్ సాబ్లు వీరే..
తొలి విడతలో 3 వేల 834 సర్పంచ్ స్థానాలతో పాటు 27 వేల628 వార్డులకు పోలింగ్ జరిగింది. తొలివిడతలో 12 వేల 960 మంది సర్పంచ్ బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 502 గ్రామ పంచాయతీల్లో 84.02 శాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 75.88 శాతం.. వికారాబాద్ జిల్లాలో 73.82 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా పల్లెల్లో సర్పంచ్ సాబ్ కాబోయేది ఎవరనే దానిపై మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క విజేతల పేర్లు వెల్లడిస్తున్నారు.
-
సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి ఫలితాలు
తెలంగాణలో తొలివిడత ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొన్ని చోట్ల పూర్తికాగా.. మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. పలుచోట్ల భారీ భద్రత నడుమ అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
-
వేముల వాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంద్రాల ప్రసాద్ విజయం
వేములవాడ మండలం జయవరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంద్రాల ప్రసాద్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రామరాజు 40 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
-
వేములవాడలో BRS.. సిద్ధిపేటలో కాంగ్రెస్ హవా
వేములవాడ గ్రామీణ మండలం తుర్కాశి నగర్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి షేక్ షాదుల్లా విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మాందాపూర్ సర్పంచిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి లింగాల మౌనిక విజయం దక్కించుకున్నారు.
-
బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ బికోజి విజయం
తుంగతుర్తి మండలం బాపనబావి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి సభావత్ బికోజి సర్పంచిగా విజయం సాధించారు.
-
విజేతల ఫలితాలు వచ్చేశాయ్.. గొల్లగూడెం గ్రామంలో BRS సర్పంచి అభ్యర్ధి విజయం
ఎట్టకేలకు తొలి విడత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక విజేత ఫలితాలు ఒక్కొక్కటిగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచిగా భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్ధి రావుల రజిత ఘన విజయం సాధించారు.
-
మరికాసేపట్లోనే తొలి విడతల ఎన్నికల ఫలితాలు
రాష్ట్రంలో మొత్తం మూడు విడుతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలివిడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెలువడనున్నాయి.
-
396 సర్పంచ్, 9,633 వార్డు స్థానాలకు ఏకగ్రీవం.. కాసేపట్లో 3,834 సర్పంచ్ స్థానాల ఫలితాలు
తొలి విడత సర్పంచి ఎన్నికల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించగా మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగిసింది. మరికాసేపట్లోనే ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
-
రంగారెడ్డి జిల్లాలో 88.67 శాతం పోలింగ్
రంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 88.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
-
ఓటు వేసేందుకు 2700 కి.మీ ప్రయాణించిన విద్యార్ధిని
మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2700 km దూరంలోని ఐఐటి గౌహతిలో ఐఐటి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అశ్విత.. సంగారెడ్డి మండలంలోని స్వగ్రామమైన కందిలో ఓటు హక్కు వినియోగించుకుంది.
-
ఓటేసి.. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ముక్కలుగా చించేసిన మహానుభావుడు
రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ తండాలో మరో ఓటర్ హల్చల్ చేశాడు. పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ పేపర్ను ఓ వ్యక్తి చించేశాడు. పొరపాటున వేరే అభ్యర్థికి ఓటు వేయడంతో బ్యాలెట్ పేపర్ చించేశానని సత్యనారాయణ తెలిపాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
బ్యాలెట్ పేపర్ను కసపిస నమిలేసిన ఓటర్.. ఆ తర్వాత సీన్ ఇదే
జగిత్యాల జిల్లా వెంకటాపూర్లో వింత ఘటన. బ్యాలెట్ పేపర్ను నమిలి ఉమ్మేసిన ఓటర్. మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ వెంకట్ అనే వ్యక్తి నమిలి ఉమ్మేశాడు. వెంటనే పోలీసులు వెంకట్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
-
సాయంత్రం 5 గంటల్లోపు తొలి విడత ఫలితాలు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు క్లైమాక్స్కి చేరాయి. ఇప్పటికే ఆయా పల్లెల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రయి కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వెలువడనున్నాయి. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
-
కౌంటింగ్ ప్రారంభం..
- సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
- తొలివిడతలో 3834 గ్రామాల్లో ముగిసిన పోలింగ్
- సర్పంచ్ ఫలితాల తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక
-
ముగిసిన పోలింగ్
- ముగిసిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్
- క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
-
ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్
- ఒంటిగంటకు ముగియనున్న పోలింగ్
- ఒంటిగంట లోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
-
ఓటర్ హల్చల్
- రంగారెడ్డి జిల్లాలో ఓటర్ హల్చల్
- పెద్ద షాపూర్ తండా పోలింగ్ కేంద్రంలో..
- బ్యాలెట్ పేపర్ను చించేసిన సత్యనారాయణ
- తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా తొందరలో మరొకరికి ఓటు
- పోలింగ్ కేంద్రంలోనే బ్యాలెట్ పేపర్ చించేసిన సత్యనారాయణ
- ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు
-
కాసేపట్లో ముగియనున్న పోలింగ్
- కాసేపట్లో ముగియనున్న తొలివిడత ఎన్నికల పోలింగ్
- ఉ.11 గంటల వరకు 51.97 శాతం పోలింగ్ నమోదు
- వరంగల్లో అత్యధికంగా 61.21 శాతం పోలింగ్
- ఆదిలాబాద్లో అత్యల్పంగా 40.37 శాతం
- రంగారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 53.34శాతం పోలింగ్
- ఒంటి గంటకు వరకు సాగనున్న పోలింగ్
- ఒంటి గంట తర్వాత క్యూలైన్లో ఉన్న వాళ్లకే ఓటు వేసే చాన్స్
- 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
- సాయంత్రం వెలువడనున్న ఫలితాలు
-
పోలింగ్ కేంద్రాల దగ్గర పొలిటికల్ ఫైట్లు
- పోలింగ్ కేంద్రాల దగ్గర పొలిటికల్ ఫైట్లు
- నాలుగైదు పోలింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఘర్షణలు
- చింతకాని పోలింగ్ కేంద్రం దగ్గర ఇరువర్గాల బాహాబాహి
- మణుగూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట
- నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోనూ సేమ్ సీన్స్
- ఉర్మడ్ల గ్రామంలో గుత్తా వర్సెస్ కంచర్ల వర్గీయుల మధ్య వాగ్వాదం
- కేతేపల్లి మండలం కొర్లపహాడ్లోనూ టెన్షన్ వాతావరణం
-
అంబులెన్స్లో వచ్చి ఓటు
- అంబులెన్స్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్
- నిజామాబాద్ జిల్లా సాలుర మండలం జాడి జామాల్ పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రాజు
- అంబులెన్స్ వద్దకే వచ్చి ఓటు వేయించుకున్న అధికారులు
Ambulance Vote
-
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ
- నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్
- కేతేపల్లి మండలంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
- కొర్లపహాడ్లో రాళ్లు, కత్తులతో ఇరువర్గాల దాడి
- ఇరువర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- కొర్లపహాడ్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
-
బ్యాలెట్ పేపర్లో వార్డు సభ్యుడి పేరు మిస్సింగ్
- నాగర్కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్
- వెల్దండ మం కుప్పగండ్లలో 10వ వార్డుకు తిరిగి పోలింగ్ ప్రారంభం
- అరగంట తర్వాత వేరే బ్యాలెట్ పేపర్లు తెచ్చి పోలింగ్ నడిపిస్తున్న అధికారులు
- బ్యాలెట్ పత్రంలో ఓ వార్డు సభ్యుడి గుర్తు లేకపోవడంతో కాసేపు నిలిచిన పోలింగ్
-
కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘర్షణ
- పోలింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట
- పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారం చేస్తున్నారని ఒకరిపై మరొకరు ఫిర్యాదు
- ఘటనా స్థలంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
- కాంగ్రెస్ నేతల తీరుపై రేగా కాంతారావు ఆగ్రహం
-
9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్
- తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్ నమోదు
- మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్
- కొమురంభీం ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7.85 శాతం పోలింగ్
-
గతేడాది కంటే పోలింగ్ పెరుగుతుంది
- తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్
- పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున స్టేట్ ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని
- గతేడాది కంటే పోలింగ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం – రాణి కుముదుని
- ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి – రాణి కుముదుని
-
మెదక్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
- ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల హోరు
- పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం
- భారీ బందోబస్తు నడుమ సాగుతున్న పోలింగ్
- 420 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు
- ఇప్పటికే 39 గ్రామాల్లో ఏకగ్రీవం
-
కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
- ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్
- జిల్లాలో 398 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
- ఇప్పటికే 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
- 373 స్థానాలకు పోలింగ్ ప్రారంభం
- మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్
- సాయంత్రం వెలువడనున్న ఫలితాలు
-
ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 317 పంచాయతీలకు ఎన్నికలు
- ఖమ్మం జిల్లాలో 172 గ్రామ పంచాయతీలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 145 పంచాయతీలకు ఎన్నికలు
- మొత్తం 3,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- 570 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారా
-
నల్గొండ జిల్లాలో 585 గ్రామాల్లో పోలింగ్
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో 28 మండలాల్లో తొలి విడత ఎన్నికలు
- 585 సర్పంచ్ స్థానాలు, 4,776 వార్డులకు పోలింగ్
- బరిలో 1,836 సర్పంచ్ అభ్యర్థులు, వార్డు స్థానాలకు 11,281మంది అభ్యర్థులు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 8లక్షల 54వేల 530 మంది
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6వేల మంది పోలీసులతో బందోబస్తు
-
వరంగల్లో 503 గ్రామాల్లో పోలింగ్
-
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
- 555 సర్పంచ్ స్థానాల్లో 52 స్థానాలు ఏకగ్రీవం
- బరిలో 1,784 మంది సర్పంచ్ అభ్యర్థులు
- 3,796 వార్డు స్థానాలకు బరిలో నిలిచిన 9,250 మంది అభ్యర్థులు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4వేల మంది పోలీసులతో బందోబస్త
-
-
ఆదిలాబాద్ జిల్లాలో 506 గ్రామాల్లో పోలింగ్..
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన పోలింగ్
- 506 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
- ఇప్పటికే 62 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
- 439 పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలు
- బరిలో 1600 మంది సర్పంచ్ అభ్యర్థులు
Published On - Dec 11,2025 7:01 AM




