Telangana: పదవుల పందేరంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ.. మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి?

తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీతోపాటు పార్టీ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఆశల పల్లకిలో విహరిస్తున్నారు.

Telangana: పదవుల పందేరంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ.. మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి?
Revanth Reddy Gandhi Bhavan
Follow us

|

Updated on: Aug 13, 2024 | 2:11 PM

తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీతోపాటు పార్టీ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని నేతలు అశించారు. అయితే సామాజిక సమీకరణలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడింది. ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరింత గ్యాప్ వచ్చింది. ఇక తాజాగా మరోసారి పదవుల పందారంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి? మరికొద్ది రోజుల్లో సీట్‌ న్యూస్‌ అందుకునేదెవరు? 6 బెర్తుల్లో ఒకటైనా దక్కకపోతుందా అనే ఆలోచనతో లాబీయింగ్‌ చేసుకుంటున్న ఆశావహులెవరో చూద్దాం..!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆషాఢం ముగిసి…శ్రావణ మాసం నడుస్తోంది. ఉందీలే మంత్రీ కాలం ముందుముందునా అని పాడుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పదవుల పంపకం ఉంటుందని అందరూ భావించారు. అయితే పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనకు వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నేతలు వేచి చూస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి, బుధవారం (ఆగస్ట్ 14) హైదరాబాద్‌ రానున్నారు. మరుసటి రోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 13 రోజులపాటు విదేశాల్లో పర్యటించిన సీఎం రేవంత్, ఆగస్ట్ 16వ తేదీ నుంచి పాలనాపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఆ తర్వాత పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక సీఎం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్‌ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్‌ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో.. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే కూడికలు తీసివేతలు ఓ కొలిక్కి రాలేదో ఏమో గానీ..! ఆషాఢం ఆశలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. శ్రావణంలో మంత్రి వర్గం విస్తరణ చేద్దాం, అప్పుడే చూద్దాం అని అధిష్టానం చెప్పడంతో ఈ ఆశలకు టెంపరరీగా కామా పడింది. ఇంతలో రేవంత్ ఫారిన్ టూర్‌తో కొంత జాప్యం జరిగింది. అయితే, నాలుగు మంత్రి పదవులు మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు శ్రావణ మాసం ముంచుకొస్తున్న శుభ ముహూర్తాన ఆశావహుల్లో మళ్లీ కదలిక మొదలైంది. మంత్రివర్గ బెర్తులపై కర్చీఫులు వేయడం మొదలైంది. మొన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్‌, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, నకిరేకల్‌ శాసనసభ్యుడు వేముల వీరేశం, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు… సీఎం రేవంత్‌ రెడ్డిని ఇదివరకే కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ సీఎం దృష్టిలో పడ్డారు.

ఇక లేటెస్టుగా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 34 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ తరఫున గెలిచింది తాను ఒక్కడినే కాబట్టి, మంత్రివర్గం విస్తరణలో తనకు అవకాశం వస్తుందంటున్నారు ఆయన. మూడు సార్లు గెలిచిన సీనియర్‌ కావడంతో, తనకు అవకాశం ఉంటుందని ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా తనకు ఛాన్స్‌ ఉంటుందని నమ్ముతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌.. ఎస్టీ కోటాలో కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్నారు. ఆశావహుల జాబితాలో బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే, మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత గడ్డం వివేక్‌ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా కూడా పనిచేశారు.

మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ స్వయంగా ప్రకటించడం.. శ్రీహరికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పేరు కూడా ఆశావహుల జాబితాలో ఉంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే 6 బెర్తులు ఖాళీగా ఉన్నా.. ప్రస్తుతం నలుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, మైనారిటీ కోటాను తర్వాత భర్తీ చేస్తారని చెబుతున్నారు.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్‌, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్‌ గౌడ్‌లు.. పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా పలువురు ఆశావహులు…శ్రావణ పల్లకీలో విహరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.