CM Revanth Reddy: మూసి నదిపై ప్రభుత్వం కొత్త ప్లాన్.. హైదరాబాద్ ఎలా మారబోతుందంటే..

| Edited By: Srikar T

Jan 04, 2024 | 7:39 PM

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన విజన్‎లో ఒకటి. ఎన్నికల ముందు నుండి దీనిపై రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో దీనిపై ఫోకస్ పెంచారు. రాబోయే 36 నెలల్లో మూసి పరివహం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.

CM Revanth Reddy: మూసి నదిపై ప్రభుత్వం కొత్త ప్లాన్.. హైదరాబాద్ ఎలా మారబోతుందంటే..
Cm Revanth Reddy
Follow us on

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన విజన్‎లో ఒకటి. ఎన్నికల ముందు నుండి దీనిపై రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో దీనిపై ఫోకస్ పెంచారు. రాబోయే 36 నెలల్లో మూసి పరివహం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఇది ఫేస్ 1 మూసి ప్రాజెక్టుగా ఉండబోతోంది. మూసీ నది పరివాహక అభివృద్ధిపై హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఎమ్యూస్ మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాన్నారు. ఇందుకోసం విదేశాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్‎ల డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

మూసీ నది పరివాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే వీటి పరిధిలోని చారిత్రక కట్టడాలు చార్మినార్, తారామతి బరాదరీ ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందిచాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్‎ను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇక రానున్న రోజుల్లో అనేక కొత్త ప్రణాళికలతో మూసి పరివాహ ప్రాంతా అభివృద్ధికి కృషి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..