AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Cabinet: సన్న వడ్లకు రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

TS Cabinet: సన్న వడ్లకు రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
CM Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Oct 26, 2024 | 8:20 PM

Share

రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.

ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి  ఎకరానికి రూ.250 చొప్పున భూమికేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఉన్న హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రెరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమీషన్‌ను ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌గ్రౌండ్స్‌ భూమి బదలాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..