AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: “ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వం”… నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సీఎం చెప్పారు.

CM KCR:  ఇక నుండి కేంద్రానికి చుక్కలే... నిద్ర పోనివ్వం... నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
Cm Kcr
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2021 | 8:13 PM

Share

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగిందన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం నిలువ చేసే భారీ, శాస్త్రీయ గోదాములు రాష్ట్రంలో ఉండవని తెలిపారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని.. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వరి వద్దన్నారని వివరించారు. అనేక పెట్టుబడులు పెట్టి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని..  ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతుబీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరిగా దొరికేవి కావని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ ప్రకటించారు. కల్తీ విత్తనాలమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చిన సర్కారు తమదే అన్నారు సీఎం.

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ కీ పాయింట్స్:

* ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోంది. * ధాన్యం కొనుగోలు చేయమని నిరాకరిస్తోంది. * ధాన్యం నిల్వ చేసే అవకాశం రాష్ట్రాలకు లేదు.  కేంద్రం కొనుగోలు చేయాలి. * నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలుపై సంబంధిత మంత్రి సంప్రదించాను. * పంట మార్పిడి చేయాలని కేంద్ర మంత్రి చెప్పారు. * తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్‌ రైసే * వానకాలంలోనే రా రైసు వస్తుంది. * తెలంగాణ ప్రభుత్వంతో ఎఫ్‌సిఐ కుదుర్చుకున్న ఎంఓయూలను కేంద్రం పట్టించుకోవడంలేదు * భవిష్యత్తులో బాయిల్డ్‌ రైసు ఇవ్వమని చెబితేనే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. * విదిలేక అంగీకరించాం. * ఈ ఏడాది ఎంత తీసుకుంటామో కేంద్రం ఇప్పటి వరకు చెప్పలేదు * వర్షాకాలంలో 62లక్షల ఎకరాలో వరి పంట సాగు చేశారు. * కోటి 70లక్షల టనున్న ధాన్యం వచ్చింది. * కోటి 10లక్షల టన్నుల రైసు తెలంగాణలో రెడీ గా ఉంది. ఇది తీసుకునే దిక్కేలేదు. * వరికంటే ఎక్కువ లాభం వచ్చే పంటలను వేయాలి. * బండి సంజయ్‌ పచ్చి అబద్దాలను చెబతున్నాడు. * సంజయ్‌ ఎవరి మెడలు వంచుతడు, ఆయన మెడలు వంచుతడా, కేంద్రం మెడలు వంచుతడ * కేంద్రం ఆర్డర్‌ ఇస్తదా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెబుతారా?

రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వమన్నారు కేసీఆర్. రైతులను గందరగోళానికి గురి చేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తామని చెప్పారు. సిల్లి బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దని పేర్కొన్నారు.

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు.

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి