Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తల్లిని రూ.100 అడిగిన కొడుకు.. వెంటనే ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఆరోతరగతి విద్యార్థి

అడిగిన వెంటనే తల్లి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన సుదీర్ ఇంట్లో ఫ్యాన్ కి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తండ్రులు ఇంటికొచ్చి చూసేసరికి విగత జీవిగా ఉన్న సుదీర్ ను చూసి బోరున విలపించారు. విద్యార్థి సుధీర్ చనిపోవడం తో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Telangana: తల్లిని రూ.100 అడిగిన కొడుకు.. వెంటనే ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఆరోతరగతి విద్యార్థి
Khammam
Follow us
N Narayana Rao

| Edited By: Surya Kala

Updated on: Oct 12, 2023 | 1:17 PM

చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. ఊహ తెలిసీ తెలియని తనంతో చేసే పనులతో తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి బాలుడు తల్లి తండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలం బేండాలంపాడులో చోటుచేసుకుంది. నోట్ పుస్తకాలకు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పుస్తకాల కొనేందుకు తల్లిని అడిగినా ఇవ్వలేదని మనస్థాపనతో మనస్థాపంతో ఆరో తరగతి విద్యార్థి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడుకు చెందిన లక్ష్మణరావు కుమారి దంపతుల కుమారుడు సుధీర్ (11)గ్రామంలోని ప్రాథమిక పాటశాల లో 6 వ తరగతి చదుుతున్నాడు. తాను నోట్ పుస్తకాలు కొనుకునేందుకు.. 100 రు ఇవ్వాలని బాలుడు తల్లిని అడిగాడు. అయితే సరిగా బడికి వెళ్ళని నీకు పుస్తకాలు ఎందుకు అని గట్టిగా మందలించారు. సాయంత్రం ఇస్తాను అని చెప్పి అనంతరం బయట పనికి వెళ్ళిపోయింది. తల్లి దండ్రులు ఇద్దరూ కూలీ పనులు కోసం బయటకు వెళ్ళారు.

అడిగిన వెంటనే తల్లి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన సుదీర్ ఇంట్లో ఫ్యాన్ కి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తండ్రులు ఇంటికొచ్చి చూసేసరికి విగత జీవిగా ఉన్న సుదీర్ ను చూసి బోరున విలపించారు. విద్యార్థి సుధీర్ చనిపోవడం తో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

చదువుకునే చిన్న వయసులోనే క్షణికా వేశంలో..కేవలం వంద రూపాయలు డబ్బులు కోసం విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలుచి వేసింది..ఈ ఘటన తో పిల్లల పట్ల తల్లి దండ్రులు ఎలా ఉండాలో..ఎలా మాట్లాడాలో..వారి ఆలోచనలు సంతోషాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని మరోసారి అర్థం అవుతోంది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..