AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Water Fight: భారీ ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సన్నాహాలు.. నీటి పోరు పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!

పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ యాక్టివ్‌ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నీళ్లనే ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయంగా కొత్త పంచాయితీ ముందుకేసుకుంది. నీళ్లతో నిప్పులు రాజేయడానికి మళ్లీ పోరు బాట పట్టనుంది గులాబీ పార్టీ. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది.

BRS Water Fight: భారీ ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సన్నాహాలు.. నీటి పోరు పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
KCR
Balaraju Goud
|

Updated on: Feb 21, 2024 | 5:10 PM

Share

పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ యాక్టివ్‌ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నీళ్లనే ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయంగా కొత్త పంచాయితీ ముందుకేసుకుంది. నీళ్లతో నిప్పులు రాజేయడానికి మళ్లీ పోరు బాట పట్టనుంది గులాబీ పార్టీ. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది.

దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్‌, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్లాన్‌ చేశారు.

ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సక్సెస్‌తో​ జోష్‌లో​ ఉన్న బీఆర్‌ఎస్‌ ఇదే ఊపులో నీటి పోరు యాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే, స్వతంత్ర్య భారతవనీలో కనువినీ ఎరుగని జలదోపిడి. నీటి పేరుతో నోట్ల కట్టలను వెనకేసుకున్నారంటూ ఇటీవల శాసనసభ సాక్షిగా ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వంపై విరుచుకుపడింది. అసలే మేడిగడ్డ పేకమైడైందని.. సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లు కూడా డేంజర్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరి తాతలనాటి ప్రాజెక్టులు తాపీగా నిలబడ్డా.. ఇప్పటి ప్రాజెక్టులెందుకు కుంగిపోతున్నాయి. ఈ కుంగుబాటుకు కారణం మీరంటే మీరంటూ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్యవాదోపవాదాలు తారాస్థాయిలో జరిగాయి. ఇంతకూ ప్రాజెక్టుల పంచాయితీలో ఎవరి వాదనలో వాస్తవముంది..?

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ మధ్య యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతున్న ముచ్చట. లేటెస్ట్‌గా తెలంగాణలోనే అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. తప్పు నీదంటే నీదంటే ఇరు వర్గాలు వాదించుకుంటున్నాయి. అదే సమయంలో తమపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది ఏపీ. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి బీఆర్‌ఎస్సే కారణం అని కాంగ్రెస్ అరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఇదే అంశంపై అటు అసెంబ్లీలో.. ఇటు మేడిగడ్డ గట్టు మీద నుంచి బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది అధికార పార్టీ. ఇక నల్గొండ వేదికగా కాంగ్రెస్ పార్టీపై గర్జించారు మాజీ సీఎం కేసీఆర్.

మొత్తంగా అటు కేఆర్‌ఎంబీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రాజకీయం భగ్గుమంటోంది. ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో.. ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు