వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- […]

వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2019 | 10:31 PM

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- ఇంగ్లీష్‌ అంటూ విపక్షం శివాలెత్తిపోతుంటే, అసలు ప్రతిపక్షమే లేదంటూ వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న మూడు విపక్ష పార్టీలు బలంగా లేవని అధికారపార్టీ కొట్టిపారేస్తోంది. ప్రతిపక్షమే లేదన్న వైసీపీ నేతల మాటల్లోని ఆంతర్యం ఏంటన్నదానిపై టీవీ9 మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్- బిగ్ డిబేట్‌లో చర్చకొనసాగింది. ఈ చర్చలో అధికార పార్టీ వైసీపీ నుంచి రవిచంద్ర, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ, బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తూ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడంపై టీడీపీ,వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం ఉందా..? లేదా..? అన్నదానిపై ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీలో ఎవరు చేరినా వారు వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటామని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే విషయంలో టీడీపీ వెనుకడుగు వేస్తుందని వైసీపీ నేత రవిచంద్ర ఆరోపించారు. వంశీ రాజీనామా చేసినా..  ఆమోదం పొందాలంటే టీడీపీ ఫిర్యాదు చేయాలని.. అలా టీడీపీ చేస్తే.. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే.. టీడీపీకి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని.. ఈ పరిస్థితుల్లో టీడీపీ వంశీ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయమని స్పీకర్‌ను కోరే సాహసం చేయదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవిచంద్ర. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అయ్యిందో.. ఈ డిబేట్‌లో చూడండి.

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి