AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- […]

వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం లేదా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2019 | 10:31 PM

Share

ఏపీలో రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి జై కొట్టడమే కాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీడీపీ పార్టీ కథ ముగిసినట్లేనని.. 2029 నాటికి ఒక చరిత్రలా మిగిలిపోతుందంటూ వంశీ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతున్న వేళ, అధికారపార్టీ నాయకుల చేస్తున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక- ఇంగ్లీష్‌ అంటూ విపక్షం శివాలెత్తిపోతుంటే, అసలు ప్రతిపక్షమే లేదంటూ వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న మూడు విపక్ష పార్టీలు బలంగా లేవని అధికారపార్టీ కొట్టిపారేస్తోంది. ప్రతిపక్షమే లేదన్న వైసీపీ నేతల మాటల్లోని ఆంతర్యం ఏంటన్నదానిపై టీవీ9 మేనేజింగ్ డైరక్టర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్‌న్యూస్- బిగ్ డిబేట్‌లో చర్చకొనసాగింది. ఈ చర్చలో అధికార పార్టీ వైసీపీ నుంచి రవిచంద్ర, టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ, బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తూ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడంపై టీడీపీ,వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే వంశీ వైసీపీలో చేరడానికి రాజీనామా అవసరం ఉందా..? లేదా..? అన్నదానిపై ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీలో ఎవరు చేరినా వారు వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటామని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంశీ.. వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసే విషయంలో టీడీపీ వెనుకడుగు వేస్తుందని వైసీపీ నేత రవిచంద్ర ఆరోపించారు. వంశీ రాజీనామా చేసినా..  ఆమోదం పొందాలంటే టీడీపీ ఫిర్యాదు చేయాలని.. అలా టీడీపీ చేస్తే.. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే.. టీడీపీకి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని.. ఈ పరిస్థితుల్లో టీడీపీ వంశీ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయమని స్పీకర్‌ను కోరే సాహసం చేయదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవిచంద్ర. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అయ్యిందో.. ఈ డిబేట్‌లో చూడండి.

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?