Bandi Sanjay: నీలా మారడం మాకురాదు.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
రేవంత్రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నావల్ల కాదు. రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు బండి సంజయ్.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నావల్ల కాదు. రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో.. మా దగ్గర సీనియర్లు బాస్లు.. అదే కాంగ్రెస్లో హోంగార్డులు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం. మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర వారిలో సాగుతోంది. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదన్నారు బండి సంజయ్.
ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని బండి సంజయ్ అభ్యర్థించారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. ఆర్నెళ్లలో మేము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఆ స్థలంను పంచిపెడుతాం.
17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం. ఈ క్రెడిట్ మొత్తం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని బండి సంజయ్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం