డబ్బులు ఇవ్వకుంటే బ్యాంకును పేల్చేస్తానంటూ భయపెట్టాడు.. చివరికి

హైదరాబాద్ జీడిమెట్లలలోని షాపూర్‌నగర్‌ ఆదర్శ్‌ బ్యాంక్‌ దగ్గర డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. శరీరం మొత్తానికి బాంబు తరహా సెటప్‌ చేసుకొని ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున ఓ వ్యక్తి సాధారణంగానే బ్యాంకులోకి ప్రవేశించాడు.

డబ్బులు ఇవ్వకుంటే బ్యాంకును పేల్చేస్తానంటూ భయపెట్టాడు.. చివరికి
money
Follow us

|

Updated on: May 20, 2023 | 4:33 AM

హైదరాబాద్ జీడిమెట్లలలోని షాపూర్‌నగర్‌ ఆదర్శ్‌ బ్యాంక్‌ దగ్గర డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. శరీరం మొత్తానికి బాంబు తరహా సెటప్‌ చేసుకొని ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున ఓ వ్యక్తి సాధారణంగానే బ్యాంకులోకి ప్రవేశించాడు. అయితే ఒక్కసారిగా తన దగ్గరు బాంబు ఉందంటూ అందరిని బెదిరించసాగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని లేకుంటే బ్యాంకు మొత్తం పేల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడున్న బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. చివరికి అతని బాడిపై ఉన్నదాన్ని డమ్మి బాంబుగా తేల్చేశారు. ఆ వ్యక్తిని జీడిమెట్లకు చెందిన శివాజిగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఎందుకు అలా చేశాడనే దానిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..