AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI New Rules: మొబైల్ సేవల అంతరాయానికి పరిహారం.. రూల్స్‌ మార్చిన ట్రాయ్‌

మీరు మొబైల్ సేవలలో ఏదైనా అంతరాయాన్ని ఎదుర్కొంటే చింతించకండి. దేశంలో మొబైల్ సేవలకు అంతరాయం కలిగితే, కస్టమర్ టెల్‌కామ్ కంపెనీ నుండి నష్టపరిహారాన్ని డిమాండ్ చేయవచ్చని ట్రాయ్‌ (TRAI) తెలిపింది. టెలికాం సేవల నాణ్యతా ప్రమాణాలను సవరిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ నిబంధనలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో 24 గంటలకు పైగా మొబైల్ సేవలకు..

TRAI New Rules: మొబైల్ సేవల అంతరాయానికి పరిహారం.. రూల్స్‌ మార్చిన ట్రాయ్‌
Trai
Subhash Goud
|

Updated on: Aug 04, 2024 | 9:23 PM

Share

మీరు మొబైల్ సేవలలో ఏదైనా అంతరాయాన్ని ఎదుర్కొంటే చింతించకండి. దేశంలో మొబైల్ సేవలకు అంతరాయం కలిగితే, కస్టమర్ టెల్‌కామ్ కంపెనీ నుండి నష్టపరిహారాన్ని డిమాండ్ చేయవచ్చని ట్రాయ్‌ (TRAI) తెలిపింది. టెలికాం సేవల నాణ్యతా ప్రమాణాలను సవరిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ నిబంధనలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో 24 గంటలకు పైగా మొబైల్ సేవలకు అంతరాయం కలిగితే టెలికాం కంపెనీలు వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.

అదే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే జరిమానాను రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఉల్లంఘన స్థాయిని బట్టి మొత్తం మారుతుంది. లక్ష, రెండు లక్షలు, ఐదు లక్షలు, పది లక్షల వివిధ గ్రేడ్‌లలో జరిమానా విధించబడుతుంది. సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవల కోసం గతంలో ఉన్న ప్రత్యేక నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలు జారీ చేసింది ట్రాయ్‌.

పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌కు అక్టోబర్ 1 తర్వాత సర్వీస్ అంతరాయం కలిగితే ఆ రోజు అద్దె మొత్తం తదుపరి బిల్లు నుండి తీసివేయబడుతుంది. కానీ ఈ నియమం ఏప్రిల్ 2025 నుండి ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అంటే ప్రీపెయిడ్ కస్టమర్ 12 గంటల కంటే ఎక్కువ సర్వీసును కోల్పోతే ఒక రోజు అదనపు వ్యాలిడిటీ క్రెడిట్ చేయబడుతుంది. వారంలోగా పరిహారం చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ఒక జిల్లా లేదా రాష్ట్రంలో కనీసం నాలుగు గంటలపాటు సేవకు అంతరాయం కలిగితే కంపెనీలు ట్రాయ్‌ అధికారులకు తెలియజేయాలి. అంతరాయం ఏర్పడిన జిల్లాలో నమోదైన నంబర్లకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. సర్వీస్ అంతరాయం ఏర్పడితే పోస్ట్‌పెయిడ్ ప్రీపెయిడ్ కస్టమర్‌లకు ఫిక్స్‌డ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు పరిహారం చెల్లించాలని చట్టం కోరుతోంది. ఇదిలా ఉంటే, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మొబైల్ సేవ కోల్పోతే, పరిహారం అవసరం లేదు.

ఇది కూడా చదవండి: రాత్రి నిద్రిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎంత దూరంలో ఉంచాలి? దిండు కింద ఉంచితే ప్రమాదమా!

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కొత్త చట్టం చెబుతోంది. దీని ప్రకారం, కస్టమర్ నుండి చెల్లింపు పొందిన తర్వాత కంపెనీలు ఏడు రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను అందించాలి. కంపెనీలు 2G, 3G, 4G, 5G కవరేజ్ అందుబాటులో ఉన్న జియోస్పేషియల్ మ్యాప్‌లలో కూడా ప్రదర్శించాలి. ఈ విధంగా కస్టమర్ బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరో తెలుసుకున్న తర్వాత కనెక్షన్‌లను పొందవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయని సమాచారం.

ఇది కూడా చదవండి: WhatsApp: ఈ ఫోన్‌లు వాడేవారికి షాక్‌.. ఇక నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి