స్మార్ట్ వ్యవసాయం: భూమి లేకుండానే పంటలు పండించొచ్చు!

స్మార్ట్ వ్యవసాయంలో పండ్లు, కూరగాయల తోటలను భూమిలో సాగు చేయడంలేదు. మట్టికి బదులుగా, మనుషుల మూత్రపిండాల చికిత్స కోసం రూపొందించిన పాలిమర్ (పాదర్శకమైన, సూక్ష్మ రంధ్రాలు ఉండే పాలిమర్ ఫిల్మ్. దానిని మూత్ర పిండాలలో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు) పదార్థాన్ని వాడుతున్నారు. ఆ పాలిమర్ మీదే మొక్కలు పెరుగుతాయి. నీటిని, పోషకాలను నిల్వ చేసి, మొక్కలకు అందించేందుకు ఆ ఫిల్మ్ ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికతతో ఎలాంటి వాతావరణంలోనైనా కూరగాయలు సాగు చేయడంతో పాటు, సంప్రదాయ వ్యవసాయం కంటే 90% […]

స్మార్ట్ వ్యవసాయం: భూమి లేకుండానే పంటలు పండించొచ్చు!
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 4:40 PM

స్మార్ట్ వ్యవసాయంలో పండ్లు, కూరగాయల తోటలను భూమిలో సాగు చేయడంలేదు. మట్టికి బదులుగా, మనుషుల మూత్రపిండాల చికిత్స కోసం రూపొందించిన పాలిమర్ (పాదర్శకమైన, సూక్ష్మ రంధ్రాలు ఉండే పాలిమర్ ఫిల్మ్. దానిని మూత్ర పిండాలలో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వినియోగిస్తారు) పదార్థాన్ని వాడుతున్నారు. ఆ పాలిమర్ మీదే మొక్కలు పెరుగుతాయి. నీటిని, పోషకాలను నిల్వ చేసి, మొక్కలకు అందించేందుకు ఆ ఫిల్మ్ ఉపయోగపడుతుంది. ఈ సాంకేతికతతో ఎలాంటి వాతావరణంలోనైనా కూరగాయలు సాగు చేయడంతో పాటు, సంప్రదాయ వ్యవసాయం కంటే 90% తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చు. మెరుగైన దిగుబడులు సాధించవచ్చునని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పురుగు మందులను కూడా చాలా సులువుగా మొక్కలకు అందించే వీలుంటుంది. అంతేకాదు, స్వయంగా ఈ పాలిమర్ బ్యాక్టీరియాను, వైరస్‌లను కూడా నిరోధిస్తుంది. కూలీల కొరత, పరిమిత సాగు భూమి ఉన్న జపాన్‌ వ్యవసాయ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

మూత్ర పిండాల డయాలిసిస్‌లో రక్తాన్ని శుభ్రం చేసేందుకు వాడే పాలిమర్ పదార్థాన్ని ఈ వ్యవసాయంలో వినియోగిస్తున్నామని జపాన్ శాస్త్రవేత్త యూచీ మోరీ తెలిపారు. దాదాపు 120 దేశాలలో రిజిస్టరైన ఈ వినూత్న ఆవిష్కరణకు ఆయన సంస్థ మెబియోల్ పేటెంట్ హక్కులు కూడా తీసుకుంది. జపాన్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో సాగు భూములను టెక్నాలజీ కేంద్రాలుగా ఎలా మార్చేస్తున్నారో ఇది చూస్తే అర్థమవుతుంది. పంటల పర్యవేక్షణ, నిర్వహణలో కచ్చితత్వాన్ని పెంచడంలో వ్యవసాయ సాంకేతికత సమీప భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది.

యూచీ మోరీ అనుసరిస్తున్న సాంకేతిక సాగు విధానాలు జపాన్‌లోని 150 ప్రాంతాలతో పాటు, యూఏఈ లాంటి మరికొన్ని దేశాల్లోనూ ఇప్పటికే అమలవుతున్నాయి. ముఖ్యంగా సునామీ, భారీ భూకంపాలు, 2011లో సంభవించిన అణుప్రమాదాల కారణంగా వ్యవసాయ భూములు నిస్సారంగా మారిన ఈశాన్య జపాన్‌లో ఈ విధానం ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం విత్తనాలు వేయడం నుంచి పంటల కోత వరకు వివిధ పంటల్లో రైతులకు ఉపయోగపడే 20 రకాల రోబోల అభివృద్ధికి జపాన్ ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. హొక్కాయిడో విశ్వవిద్యాలయం నిపుణులతో కలిసి, యన్మార్ అనే ఇంజిన్ తయారీ సంస్థ ఒక రోబో ట్రాక్టర్‌ను రూపొందించింది. దానిని ఇప్పటికే పంట పొలాల్లో పరీక్షించారు.

సెన్సర్ల సాయంతో ఈ ట్రాక్టర్లు పనిచేస్తాయి. ముందు, వెనుక ఏమున్నాయి? ఏవైనా అడ్డుంకులు ఉన్నాయా? అన్న విషయాలను ఆ సెన్సర్ల ద్వారా ఈ స్మార్ట్ ట్రాక్టర్లు గుర్తిస్తాయి. ఒకే డ్రైవర్ ఏకకాలంలో రెండు ట్రాక్టర్లను నడపొచ్చు. జీపీఎస్, వైఫై‌ ఫీచర్లతో, సౌర విద్యుత్‌తో నడిచే రోబోను వాహన తయారీ సంస్థ నిస్సాన్ ఈ ఏడాది మొదట్లో ఆవిష్కరించింది. కొన్నేళ్లుగా డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. పంట చేలపై పురుగు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దాంతో, మనిషి రోజంతా చేసే పనిని గంట, అరగంటలోనే పూర్తవుతోంది. భూమి లేకుండానే కొందరు వ్యవసాయం చేసేందుకు కూడా అధునాత టెక్నాలజీ దోహదపడుతోంది.

గ్రీన్‌హౌజ్‌లలో పండించడంతో పాటు, హైడ్రోపోనిక్స్ (ఇందులో మట్టి లేకుండానే నీటి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తారు) ద్వారా జపాన్‌లో పండ్లు, కూరగాయలను భారీగా పండిస్తున్నారు. ఈ విధానం ద్వారా చిబా ప్రాంతంలో మిరాయీ గ్రూప్, ప్రస్తుతం రోజూ 10,000 కట్టల పాలకూరను పండిస్తోంది. సంప్రదాయ సాగు విధానంతో పోల్చితే, వంద రెట్లు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ షెడ్లలో సెన్సర్లు ఉంటాయి. ఆ సెన్సర్ల ద్వారా వాటిలో కృత్రిమ వెలుతురును, ద్రవరూప పోషకాలను, కార్బన్‌డయాక్సైడ్ స్థాయిని, ఉష్ణోగ్రతను నియంత్రిస్తారు. క‌ృత్రిమ వెలుతురు మొక్కలు అత్యంత వేగంగా పెరిగేలా చేస్తుంది. చీడపీడలను సులువుగా నివారించవచ్చు. అయితే, వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, వినియోగానికి జపాన్ ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం తన సొంత ఆహార అవసరాలను తీర్చడం, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిచడమే.

Latest Articles
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
అతిగా తింటే విషమే..! జీడిపప్పును ఎక్కువగా తింటే ఇలా అవుతుందా..?
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
రాణించిన ఆర్సీబీ బౌలర్లు.. గుజరాత్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే?
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్