AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు కోచ్‌లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..? వాటి అర్థం ఏమిటి?

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. రైలులో టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులు..

Indian Railways: రైలు కోచ్‌లు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా..? వాటి అర్థం ఏమిటి?
Indian Railways
Subhash Goud
|

Updated on: Dec 28, 2022 | 5:53 PM

Share

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. రైలులో టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. రైల్వే స్టేషన్లలో వివిధ రంగుల రైళ్లు నిలబడి ఉండటాన్ని మీరు గమనించి ఉంటారు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల కోచ్‌లను చూసి ఉంటారు. అలా వివిధ రంగులు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? అలా రంగులు ఉండటం వెనుక అర్థం ఉంది. ఈ రంగుల ద్వారానే ఆ కోచ్‌ల ఫీచర్లను మీరు తెలుసుకోవచ్చు. ఈ కోచ్ ఎక్కడ తయారు చేయబడి ఉంటుందో కోచ్‌ని చూడటం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

కోచ్ రంగు ఆకుపచ్చగా ఉంటే ..

గరీబ్ రథ్ రైలులో ఆకుపచ్చ రంగు కోచ్‌లను ఉపయోగిస్తారు. ఇది కాకుండా మీటర్ గేజ్ రైళ్లలో బ్రౌన్ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తారు. బిలిమోర వాఘై ప్యాసింజర్ వంటి నారో గేజ్ రైళ్లలో లేత ఆకుపచ్చ రంగు కోచ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటిలో బ్రౌన్ కలర్ కోచ్‌లను కూడా ఉపయోగిస్తారు.

కోచ్ రంగు నీలం ఉంటే అర్థం ఏమిటి?

మనం ఎక్కువగా నీలం రంగు కోచ్ ఉన్న ట్రైన్ లో ప్రయాణిస్తుంటాం. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) అని కూడా అంటారు. ఈ కోచ్‌లు ఇనుముతో తయారు చేస్తారు. ఈ కోచ్‌లలో ఎయిర్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి. ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. కానీ దశలవారీగా వాటిని తొలగించి వాటి స్థానంలో ఎల్‌బీహెచ్‌ కోచ్‌లు ఉన్నాయి. నేటికీ ఈ కోచ్‌లు అనేక మెయిల్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ రైళ్లలో ఉపయోగించబడుతున్నాయి. ఇది గంటకు 70 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇలాంటివి ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో కనిపిస్తుంటుంది. ఇది ఎయిర్ బ్రేకేలతో అమర్చబడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎరుపు రంగు:

ఎరుపు రంగు కోచ్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లుగా పిలుస్తారు. ఈ కోచ్‌లను 2000 సంవత్సరంలో జర్మనీ నుంచి తెప్పించారు. అయితే ఇప్పుడు ఈ కోచ్‌లను పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తున్నారు. ఇవి అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. అలాగే ఇతర కోచ్‌ల కంటే తేలికగా ఉంటాయి. ఈ కోచ్‌లలో డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేకత కారణంగా ఈ కోచ్‌లు గంటకు 200 కి.మీ వేగంతో వెళ్తాయి. ఈ కోచ్‌లను రాజధాని, శతాబ్ది వంటి హైస్పీడ్ రైళ్లకు ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఈ కోచ్‌లను ఇతర కోచ్‌లలో కూడా ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎర్ర రంగు ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి. వీటిని రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఉపయోగిస్తారు. పచ్చ రంగులో ఉండే బోగీలను గరీబ్ రథ్‌కు ఉపయోగిస్తున్నారు. ఇక లైట్ బ్లూ కలర్ బోగీలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు వాడుతున్నారు. హంసఫర్ రైళ్లకు ట్రూ డిజిటల్ బ్లూ కలర్‌ను ఉపయోగిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తెలుపు, నీలం రంగు గీతలు ఉంటాయి. పసుపు, ఆరెంజ్ రంగు డిజైన్లలో ఉండే కోచ్‌లు ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి. ఎరుపు, పసుపు రంగులను కేవలం డబుల్ డెక్కర్, అంత్యోదయ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇక మహామన ఎక్స్‌ప్రెస్‌.. ఊదా రంగులో ఉంటుంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌కు నీలం రంగులో ఉండి, పసుపు గీత ఉంటుంది. ఆ రైలు గంటకు 155 కిమీల కంటే వేగంతో ప్రయాణిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి