AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic particles: ఆవుల శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు.. మానవులకు చేరితే ప్రమాదం తప్పదట!

శాస్త్రవేత్తలు ఆవులు, పందుల రక్తంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవులకు మైక్రోప్లాస్టిక్ ఎంతవరకు చేరుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.

Plastic particles: ఆవుల శరీరాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు.. మానవులకు చేరితే ప్రమాదం తప్పదట!
Micro Plastic Particles In Cows
KVD Varma
|

Updated on: Oct 25, 2021 | 1:33 PM

Share

Plastic particles: శాస్త్రవేత్తలు ఆవులు, పందుల రక్తంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. ఇలాంటి కేసు ప్రపంచంలో ఇదే మొదటిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవులకు మైక్రోప్లాస్టిక్ ఎంతవరకు చేరుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్‌లు ఆవుల అవయవాలలో పేరుకుపోతాయ, వాటి పాల ద్వారా మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిశోధన చేసిన ఆమ్‌స్టర్‌డ్యామ్ బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం, వారు ఒక పొలంలో 12 ఆవులు, 6 పందులను అధ్యయనం చేసారు. పరిశోధన సమయంలో, వారి రక్తంలో ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. ఈ ప్రమాదం జంతువులకే కాదు, మనుషులకు కూడా ఉండవచ్చా అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ చక్కటి ప్లాస్టిక్ కణాలు ఆహార గొలుసు ద్వారా ఒకరి నుండి మరొకరికి చేరతాయి. ఉదాహరణకు, ఆవు పాలు నుండి అది మానవులకు చేరే ప్రమాదం ఉంది.

దీనికి ముందు, ఇతర జంతువులలో ప్లాస్టిక్ కణాలు కనుగొన్నారు. అయితే, ఆవులు, పందుల రక్తంలో మైక్రోప్లాస్టిక్ కనుగొనడం ఇదే మొదటిసారి. మట్టిలో ఉండే ప్లాస్టిక్ జంతువులకు చేరుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రేగులు కూడా ఈ కణాలను విచ్ఛిన్నం చేయలేవు, ఫలితంగా అవి రక్తాన్ని చేరుకుంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. వాటిని కంటితో చూడటం కష్టం.

ఈ విధంగా మైక్రోప్లాస్టిక్స్ తయారవుతాయి

గ్రీస్‌లోని హెలెనిక్ సెంటర్ ఫర్ మెరైన్ రీసెర్చ్ పరిశోధకులు చెబుతున్నారు, ప్రతి సంవత్సరం 17,600 టన్నుల ప్లాస్టిక్ సముద్రం నుండి తొలగించబడుతుంది. వీటిలో 84 శాతం ప్లాస్టిక్ సముద్ర తీరాలలో, 6 శాతం వరకు సముద్రపు లోతులో కనిపిస్తుంది. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మైక్రోప్లాస్టిక్ కణాలు 5 మిమీ లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ప్లాస్టిక్ సీసాలు, బ్యాగులు చిరిగిపోయినపుడు లేదా పాడైనప్పుడు మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడతాయి. అంతే కాకుండా నడిచేటప్పుడు షూ అరికాలు, డ్రైవింగ్ సమయంలో కారు టైర్ నుంచి విడుదలయ్యే కణాలు కూడా ఇందులో ఉంటాయి. నీరు, ఆహారం, మనం తాకిన భూమి ఉపరితలం వంటి ప్రతిచోటా మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయి. వాటి ద్వారా అవి శరీరానికి చేరుతాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధన సహాయంతో దాని ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మైక్రోప్లాస్టిక్స్‌పై లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధన ప్రకారం, మైక్రోప్లాస్టిక్ కణాలు శ్వాస ద్వారా విండ్‌పైప్ ద్వారా రక్తం, శరీర భాగాలకు కూడా చేరుతున్నాయి. ఇందులో ఉండే రసాయనాలు మనుషులను అనారోగ్యానికి గురిచేయడంతో పాటు మంటను కూడా కలిగిస్తున్నాయి.

ఇటీవల ఇటలీ శాస్త్రవేత్తల పరిశోధనలో బొడ్డు తాడులో కూడా దొరికిన ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. మొట్టమొదటిసారిగా, మహిళ బొడ్డు తాడులో ప్లాస్టిక్ చిన్న కణాలు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కణాలు భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం,అభివృద్ధిపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీనిని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు కూడా కృషి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PM Modi: వారణాసి పర్యటనకు నరేంద్ర మోడీ.. 64 కోట్లతో ప్రజారోగ్యం కోసం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్‌కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని!

First Election in India: మన దేశంలో తొలి ఓటు పడింది ఈరోజే.. తొలిసారి ఎన్నికలు ఎలా నిర్వహించారో తెలుసా?

Snow Fall: మూడు అడుగుల మేర కురిసిన మంచు..అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు!