GPS Tracking Toll Fee: ఫాస్ట్‌ట్యాగ్‌ రోజులు ముగియనున్నాయ్‌.. కొత్త టెక్నాలజీతో టోల్‌ వసూలు.. కేంద్రం కసరత్తు..!

|

Aug 09, 2022 | 8:56 AM

GPS Tracking Toll Fee: టోల్ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే, ఫాస్ట్‌ట్యాగ్ అతి త్వరలో పాత పద్ధతిలో టోల్ టాక్స్ వసూలు వ్యవస్థగా..

GPS Tracking Toll Fee: ఫాస్ట్‌ట్యాగ్‌ రోజులు ముగియనున్నాయ్‌.. కొత్త టెక్నాలజీతో టోల్‌ వసూలు.. కేంద్రం కసరత్తు..!
Gps Tracking Toll Fee
Follow us on

GPS Tracking Toll Fee: టోల్ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే, ఫాస్ట్‌ట్యాగ్ అతి త్వరలో పాత పద్ధతిలో టోల్ టాక్స్ వసూలు వ్యవస్థగా మారనుంది. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీ సాయంతో టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ పనులన్నీ వాహనం గ్లాస్‌పై అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయాలి. వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్ళిన వెంటనే, ప్లాజాలోని RFID రీడర్‌లు ఫాస్ట్‌ట్యాగ్ నుండి డబ్బును కట్‌ అవుతాయి. ఇందులో డ్రైవర్ ఏమీ చేయాల్సిన పనిలేదు. ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌లో నడుస్తోంది.

ఈ కొత్త విధానంలో జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఎంత దూరం ప్రయాణిస్తున్నారో అదే టోల్ ట్యాక్స్ మీకు విధించబడుతుంది. హైవేపై నడిచే దూరానికి టోల్ తీసుకోబడుతుంది. ఈ ఏడాది మార్చిలో రోడ్డు మరియు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో మాట్లాడుతూ, వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పారు. ఈ దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి.

టోల్ బూత్‌ల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. GPS ఇమేజింగ్ సహాయంతో హైవేలు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలపై తిరిగే వాహనాల నుండి టోల్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది. GPS ఆధారిత టోల్ టాక్స్ వసూలు వ్యవస్థ ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో అమలు చేయబడింది. దానిని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో కూడా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుత నియమంలో టోల్ ట్యాక్స్ గణన కోసం హైవే దూరం అంటే ఒక ప్రయాణ దూరంగా పరిగణించబడుతుంది. ఇది సాధారణంగా 60 కి.మీలు,ఎక్కువ లేదా తక్కువ ఉంటే, దానికి అనుగుణంగా పన్ను కూడా మార్చబడుతుంది. అయితే 60 కిమీలను ప్రామాణికంగా పరిగణిస్తారు. అదే రహదారిపై వంతెన, కల్వర్టు లేదా ఓవర్‌బ్రిడ్జి పడితే, దాని టోల్ మారుతుంది.

ఇవి కూడా చదవండి

కొత్త టెక్నాలజీ ఏమిటి..?

కొత్త టెక్నాలజీలో ఇది జరగదు. ఎందుకంటే టోల్ డబ్బు మీ కారు ప్రయాణించే దూరం ఆధారంగా వసూలు చేయబడుతుంది. ఇందుకోసం రెండు టెక్నాలజీలపై కసరత్తు జరుగుతోంది. మొదటి టెక్నాలజీలో వాహనంలో GPS ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది హైవేపై శాటిలైట్ ద్వారా నేరుగా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుండి టోల్ డబ్బును తగ్గించడంలో సహాయపడుతుంది. నంబర్ ప్లేట్ల ద్వారా టోల్ వసూలు చేయడం రెండో టెక్నిక్.

సాఫ్ట్‌వేర్‌ సహాయంతో టోల్‌ వసూలు:

నంబర్ ప్లేట్‌లో టోల్ కోసం కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాఫ్ట్‌వేర్ సహాయంతో టోల్ వసూలు చేయడంలో సహాయపడుతుంది. ఈ టెక్నిక్‌లో, వాహనం ఏ పాయింట్ నుండి హైవేపైకి ప్రవేశిస్తుంది, దాని సమాచారం రికార్డ్ చేయబడుతుంది. దీని తరువాత, కారు హైవే నుండి బయటకు వెళ్ళే పాయింట్, అది కూడా అక్కడ నమోదు చేయబడుతుంది. ఈ సమయంలో హైవేపై వాహనం నడిపిన కిలోమీటర్ల సంఖ్యను బట్టి వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుండి టోల్ ఫీజు కట్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి