AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card: కొత్త సిమ్‌ కార్డు జారీలో మరింత కఠినం.. త్వరలో కొత్త రూల్స్‌!

SIM Card: ఈ రోజుల్లో మొబైల్‌ వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సిమ్‌ కార్డుల జారీలో నిబంధనలు మరింత కఠినం కానుంది. కొత్త సిమ్ కార్డు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు సమాచారం..

SIM Card: కొత్త సిమ్‌ కార్డు జారీలో మరింత కఠినం.. త్వరలో కొత్త రూల్స్‌!
Subhash Goud
|

Updated on: Jan 19, 2025 | 6:21 PM

Share

భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు సిమ్ కార్డుకు అర్హులుగా పరిగణిస్తారు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి తాను ఉపయోగించాలనుకుంటున్న టెలికాం కంపెనీ సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు వంటి పత్రాలు అవసరం. అయితే భవిష్యత్తులో సిమ్ కార్డు కొనేందుకు ఇవి మాత్రమే సరిపోవని అంటున్నారు. అదేమిటంటే.. సిమ్ కార్డుల జారీకి సంబంధించి ప్రధాని కార్యాలయం కొత్త నిబంధనను ప్రకటించింది. ఆ నియమం ఏమిటి ? దాని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అనే విషయాలను చూద్దాం.

సిమ్ కార్డ్ కొనుగోలుకు కొత్త నిబంధన

దేశవ్యాప్తంగా లక్షలాది మంది సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కొత్త నిబంధనను ప్రకటించనున్నారు. ఈ కొత్త నియమం దేనినీ ప్రభావితం చేయనప్పటికీ, సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియ మారుతుంది. అంటే కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసేవారికి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్ర టెలికాం శాఖను DoT ఆదేశించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఇంతకుముందు సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి కొన్ని గుర్తింపు పత్రాలను ఉపయోగించారు. అయితే భవిష్యత్తులో మీరు ఓటరు ID కార్డ్, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను తీసుకెళ్లినప్పటికీ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. ప్రజలు తమ వద్ద ఆధార్ కార్డులను తీసుకెళ్లకపోవచ్చు. కానీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే వారికి సిమ్ కార్డులు జారీ చేయనున్నారు.

కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

కొత్త సిమ్‌కార్డు కొనుగోలుకు సంబంధించిన ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై ఎలాంటి సమాచారం లేకపోయినా, నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినందున త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త రూల్‌తో సిమ్‌కార్డుల ద్వారా జరిగే మోసాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి