ప్రతి కథకు ముగింపు ఉంటుంది: షోయబ్ రిటైర్మెంట్పై సానియా ట్వీట్
ప్రపంచకప్లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడిన పాకిస్తాన్ ఆ దేశంపై 94పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అనంతరం పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెటర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక షోయబ్ రిటైర్మెంట్పై అతడి సతీమణి, భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. ‘‘ప్రతి కథకు ముగింపు ఉంటుంది. జీవితంలో […]
ప్రపంచకప్లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడిన పాకిస్తాన్ ఆ దేశంపై 94పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అనంతరం పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెటర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక షోయబ్ రిటైర్మెంట్పై అతడి సతీమణి, భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు.
‘‘ప్రతి కథకు ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతి ముగింపు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. షోయబ్.. 20సంవత్సరాలుగా నీ దేశం గర్వపడేలా నువ్వు ఆడావు. నీ విజయాలను చూసి నేను, ఇజాన్ గర్వపడుతున్నాం. అలాగే నీ ప్రేమను కూడా’’ అంటూ సానియా ట్వీట్ చేసింది. కాగా ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడిన మాలిక్.. కేవలం ఎనిమిది పరుగులే చేశాడు.
‘Every story has an end, but in life every ending is a new beginning’ @realshoaibmalik ? u have proudly played for your country for 20 years and u continue to do so with so much honour and humility..Izhaan and I are so proud of everything you have achieved but also for who u r❤️
— Sania Mirza (@MirzaSania) July 5, 2019