జడేజా సంచలనం.. 21వ శతాబ్దపు విలువైన క్రికెటర్గా అరుదైన గౌరవం..
ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో అసమాన్య ప్రతిభ చూపుతోన్న అతనిని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా విజ్డెన్ ఇండియా అనౌన్స్ చేసింది.
ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో అసమాన్య ప్రతిభ చూపుతోన్న అతనిని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా విజ్డెన్ ఇండియా అనౌన్స్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ జడ్డూ అత్యద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొంది. క్రిక్విజ్ టూల్ సహాయంతో రవీంద్ర జడేజా ప్రదర్శనని విశ్లేషించిన విజ్డెన్ ఇండియా.. అతనికి ఏకంగా 97.3 రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. జడేజా కంటే శ్రీలంక లెజండరీ క్రికెటర్ ముత్తయ్ మురళీధరన్ మాత్రమే ఈ రేటింగ్లో ముందున్నాడు.
2009లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన రవీంద్ర జడేజా… మూడేళ్ల వరకూ టెస్టుల్లో చోటు దక్కలేదు. 2012లో ఇంగ్లాండ్పై తొలి టెస్టులో ఆడిన జడ్డూకి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బౌలింగులో అద్భుత ప్రదర్శన చేస్తూ.. మిడిలార్డర్లో సత్తా ఉన్న బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందాడు. చాలాసార్లు.. టెయిలెండర్లతో కలిసి భారత్కి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. కాగా జడేజా ఇప్పటి వరకూ 49 టెస్టులాడి 35.26 సగటుతో 1,869 రన్స్ చేశాడు. ఆసిస్ మాజీ ఆల్రౌండన్ షేన్ వాట్సన్ టెస్టు సగటు 35.2 కంటే ముందంజలో ఉన్నాడు జడేజా. ఇదే విషయాన్ని విజ్డెన్ ఇండియా కూడా తెలిపింది.
టెస్టుల్లో 2.44 ఎకానమీతో బౌలింగ్ చేసిన జడ్డూ.. ఇప్పటి వరకూ 213 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 24.63గా ఉంది. టెస్టుల్లో ఒకసారి 10 వికెట్ల ఘనతని కూడా అందుకున్న జడేజా.. తొమ్మిదిసార్లు 5 వికెట్ల మైలురాయిని ఒడిసిపట్టాడు. బ్యాటింగ్లోనూ అతని ఖాతాలో ఒక శతకం, 14 అర్థ శతకాలు ఉన్నాయి.